కీర్తిసురేశ్ పారితోషికం అంత పెంచేసిందా?

ABN , First Publish Date - 2021-10-22T17:25:51+05:30 IST

నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తిసురేశ్ ‘అన్నాత్త, గుడ్ లక్ సఖి, సానికాయుధం, మరక్కార్ అరబిక్కడలిండే సింహం, సర్కారు వారి పాట’ చిత్రాల్లో నటిస్తున్నారు. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇక రీసెంట్ గా నేచురల్ స్టార్ నానీ నటిస్తోన్న ‘దసరా’ అనే మూవీలో కథానాయికగా కమిట్అయింది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించనున్న ఈ సినిమాలో కీర్తి కథానాయికగా నటిస్తోంది.

కీర్తిసురేశ్ పారితోషికం అంత పెంచేసిందా?

నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తిసురేశ్ ‘అన్నాత్త, గుడ్ లక్ సఖి, సానికాయుధం, మరక్కార్ అరబిక్కడలిండే సింహం, సర్కారు వారి పాట’ చిత్రాల్లో నటిస్తున్నారు. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇక రీసెంట్ గా నేచురల్ స్టార్ నానీ నటిస్తోన్న ‘దసరా’ అనే మూవీలో కథానాయికగా కమిట్ అయ్యారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించనున్న ఈ సినిమా రీసెంట్ గా అనౌన్స్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకోసం కీర్తి రూ. 3కోట్లు పారితోషికం అందుకున్నట్టు తెలుస్తోంది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నానీ పూర్తి స్థాయిలో తెలంగాణ యాసను పలకబోతున్నారు. 



కీర్తి సురేశ్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఆమె తన పారితోషికాన్ని పెంచినట్టు తెలుస్తోంది. నిజానికి ఆమె ప్రస్తుతం డిమాండ్ చేస్తున్న మొత్తానికి కన్నా చాలా తక్కువ పారితోషికం అందుకుంటున్నట్టు, ఇకపై పెద్ద ప్రాజెక్ట్స్ విషయంలో ఎలాంటి బేరసారాలు ఉండవని స్పష్టం చేసినట్టు టాక్. అలాగే.. ఇకనుంచి ఆమె నటించబోయే సినిమాలకు ఇదే అప్లై చేయబోతున్నట్టు సమాచారం. 

Updated Date - 2021-10-22T17:25:51+05:30 IST