‘టేక్‌ డైవర్షన్‌’కు ‘పేట’ దర్శకుడి అభినందనలు

ABN , First Publish Date - 2021-07-27T01:21:37+05:30 IST

చెన్నై నుంచి పుదుచ్చేరి జర్నీలో జరిగే సంఘటనలతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘టేక్‌ డైవర్షన్‌’. శివానీ సెంథిల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో శివకుమార్‌ అనే యువకుడు హీరోగా పరిచయమవుతున్నాడు. ఇందులో గాయత్రి, పాటినీ కుమార్‌

‘టేక్‌ డైవర్షన్‌’కు ‘పేట’ దర్శకుడి అభినందనలు

చెన్నై నుంచి పుదుచ్చేరి జర్నీలో జరిగే సంఘటనలతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘టేక్‌ డైవర్షన్‌’. శివానీ సెంథిల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో శివకుమార్‌ అనే యువకుడు హీరోగా పరిచయమవుతున్నాడు. ఇందులో గాయత్రి, పాటినీ కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘పేట’, ‘చదురంగవేట్టై’ వంటి చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించిన రామచంద్రన్‌ ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. వీరితో పాటు జాన్‌ విజయ్‌, జార్జ్‌ విజయ్‌, బాలా జె.చంద్రన్‌, శ్రీనివాసన్‌ అరుణాచలం తదితరులు ఇతర తారాగణం. ‘ఎన్‌ పెయర్‌ ఆనందన్‌’ తదితర చిత్రాలకు సంగీతం సమకూర్చిన జోస్‌ ఫ్రాంక్లిన్‌ సంగీతం సమకూర్చుతుండగా ఈశ్వరన్‌ తంగవేల్‌ డీవోపీగా పనిచేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకోగా సీనియర్‌ సంగీత దర్శకుడు దేవా ఇందులో ఓ గానా పాటను పాడారు. 


ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘పేట’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ తాజాగా విడుదల చేసి, చిత్ర బృందాన్ని అభినందించారు. జీవిత ప్రయాణంలో అనేక సంఘటనలు ఎదురవుతుంటాయని, ఇవేమీ పట్టించుకోకుండా మనం ముందుకు సాగినట్టయితే విజయం తథ్యం అనే అంశాన్ని హాస్య కోణంలో వెండితెరపై చూపించనున్నట్టు దర్శకుడు శివానీ సెంథిల్‌ వెల్లడించారు. 

Updated Date - 2021-07-27T01:21:37+05:30 IST