KGF 2 ని బాలీవుడ్‌లో తీస్తే డిజాస్టరే.. Yash మూవీపై Karan Johar షాకింగ్ కామెంట్స్

ABN , First Publish Date - 2022-06-19T17:25:16+05:30 IST

బాలీవుడ్‌లోని అత్యంత విజయవంతమైన చిత్రనిర్మాతలలో కరణ్ జోహార్ ఒకరు. ఓ వైపు డైరెక్టర్‌గా కొనసాగుతూనే...

KGF 2 ని బాలీవుడ్‌లో తీస్తే డిజాస్టరే.. Yash మూవీపై Karan Johar షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్‌లోని అత్యంత విజయవంతమైన చిత్రనిర్మాతలలో కరణ్ జోహార్ ఒకరు. ఓ వైపు డైరెక్టర్‌గా కొనసాగుతూనే మరో వైపు వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు. అలాగే మరోవైపు ఇతర సినిమాలను డిస్ట్రీబ్యూషన్ కూడా చేస్తున్నాడు. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో జరిగే పలు విషయాలపై మనసులో మాటలను ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పేస్తుంటారు. తాజాగా సైతం ఈ 50 ఏళ్ల డైరెక్టర్ సూపర్ హిట్ ప్యాన్ ఇండియా మూవీ ‘కె.జి.యఫ్ ఛాప్టర్ 2’ షాకింగ్ కామెంట్స్ చేశాడు.


కరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘KGF 2 విడుదలై తర్వాత ఈ సినిమాపై వచ్చిన సమీక్షలని కొన్నింటిని చదివాను. అవి చదివిన తర్వాత ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో తీసుంటే డిజాస్టర్‌గా మిగిలేదని అనిపించింది. ఆ సమీక్షలు చేస్తూ హిందీ మూవీస్ తీసేవారికి కొత్తగా ప్రయత్నించే వీలు లేకుండా చేస్తున్నారు. ఇక్కడ రెండు రకాల అస్తిత్వాలు ఉన్నవారు ఉన్నారు. అది ఆపితే కానీ.. బాలీవుడ్‌లో గొప్ప సినిమాలు రావు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్, కెజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లని సాధించాయి. దానికి కారణం ఆ ఫిల్మ్ మేకర్స్‌కి ఉన్న విజన్. ఇదే హిందీ మేకర్స్‌లో, సినిమాల్లో లోపించింది’ అని చెప్పుకొచ్చాడు.




కాగా.. కరణ్ తన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా ప్రస్తుతం జగ్ జగ్ జీయో అనే సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో వరుణ్ ధావన్, కియారా అడ్వాణీ, అనిల్ కపూర్, నీతూ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూన్ 24, 2022న థియేటర్లలో విడుదల కానుంది. అంతేకాకుండా.. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రణ్‌వీర్ సింగ్, అలియా భట్, ధర్మేంద్ర, జయ బచ్చన్, షబానా అజ్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 10 ఫిబ్రవరి 2023న విడుదల కానుంది.

Updated Date - 2022-06-19T17:25:16+05:30 IST