కరణ్ జోహార్ నిర్మాణంలో ప్రభాస్ ?

ABN , First Publish Date - 2022-01-26T20:17:57+05:30 IST

బాలీవుడ్ బడా మేకర్ కరణ్ జోహార్ .. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా నిర్మించబోతున్నాడట. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వార్త ఇది. ‘బాహుబలి’ సిరీస్ తో ప్రభాస్ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగానూ ఆయన పేరు మారుమోగింది. ఆపై ప్రభాస్.. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కు మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే.

కరణ్ జోహార్ నిర్మాణంలో ప్రభాస్ ?

బాలీవుడ్ బడా మేకర్ కరణ్ జోహార్ .. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా నిర్మించబోతున్నాడట. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వార్త ఇది. ‘బాహుబలి’ సిరీస్ తో ప్రభాస్ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగానూ ఆయన పేరు మారుమోగింది. ఆపై  ప్రభాస్.. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కు మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు.  ప్రస్తుతం ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే. అసలు విషయానికొస్తే ప్రభాస్ తో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఓ సినిమా నిర్మించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. 


ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మించబోతున్నట్టు టాక్. దీనికి దర్శకుడు మరెవరో కాదు.. ప్రస్తుతం ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ కె’ తెరకెక్కిస్తున్న నాగ్ అశ్విన్. త్వరలోనే ఈ సినిమా ప్రకటన వెలువడనుంది. ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ అదిరిపోయే కథాంశం రెడీ చేస్తున్నాడట. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభాస్ తో వరుసగా రెండు సినిమాలు డైరెక్ట్ చేసే అరుదైన ఛాన్స్ నాగ్ అశ్విన్ అందుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈ సినిమా ప్రకటన ఎప్పుడు వస్తుందో .. సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందో చూడాలి.

Updated Date - 2022-01-26T20:17:57+05:30 IST