నవంబర్ 12 రిలీజ్ లిస్ట్‌లోకి ‘కపట నాటక సూత్రధారి’

ABN , First Publish Date - 2021-11-11T01:07:52+05:30 IST

విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాష్ తదితరులు ప్రధాన తారాగణంగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘కపట నాటక సూత్రధారి’. క్రాంతి సైనా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి

నవంబర్ 12 రిలీజ్ లిస్ట్‌లోకి ‘కపట నాటక సూత్రధారి’

విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాష్ తదితరులు ప్రధాన తారాగణంగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘కపట నాటక సూత్రధారి’. క్రాంతి సైనా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 12న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శివారెడ్డి, ‘నాంది’ చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 


ఈ కార్యక్రమంలో శివారెడ్డి మాట్లాడుతూ.. ఇన్ని రోజులు ఇంత మంచి టైటిల్ ఎలా వదిలేశారా అని అనిపిస్తుంది. డైరెక్టర్ క్రాంతి ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు. నిర్మాతలు దేనికి కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను ఇంత బాగా తెరకెక్కించడం సంతోషంగా ఉంది. అందరికీ ఆల్ ది బెస్ట్.. అని అనగా, దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. దర్శకుడు క్రాంతి నాకు చాలా సన్నిహితుడు. మేమిద్దరం ఎన్నో సినిమాలు కలిసి చేశాం. ఇప్పుడు నా స్నేహితుడు దర్శకుడు కావడం అందంగా ఉంది. నిర్మాత మనీష్ కూడా నా ఆప్త మిత్రుడు. వీరిద్దరూ ఓ మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నారు. తప్పకుండా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.. అన్నారు. నటుడు సంపత్ రెడ్డి మాట్లాడుతూ.. శివారెడ్డిగారి సోదరుడిగా సినిమాలలోకి వస్తున్నాను. శివారెడ్డిగారి అన్ని పనులు చూస్తున్నాను. అప్పుడప్పుడు నేనెప్పుడు స్టేజ్ ఎక్కుతానా? అని అనుకునేవాడిని.. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. నవంబర్ 12న తప్పకుండా ఈ సినిమాను ప్రేక్షకులు చూడవలసిందిగా కోరుకుంటున్నాను.. అని తెలపగా.. నన్ను నమ్మి ఈ పాత్రకు నన్ను ఎంపిక చేసినందుకు క్రాంతిగారికి కృతజ్ఞతలు అని తెలిపింది నటి ఇందు.


హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి నన్ను హీరోగా ఎంపిక చేసి అవకాశం ఇచ్చిన దర్శకుడికి, నిర్మాతకి కృతజ్ఞతలు. కపట నాటక సూత్రధారి గురించి చెప్పాలంటే ఇది చాలా మంచి కథ. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని తెలుపగా.. దర్శకుడు క్రాంతి మాట్లాడుతూ.. ముందుగా నన్ను నా కథను నమ్మి ఈ సినిమాను ఇంత వరకు తీసుకొచ్చిన నిర్మాతగారికి కృతజ్ఞతలు. ఈ సినిమా ఇంత దూరం రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు అని అన్నారు. నవంబర్ 12న వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని నిర్మాత మనీష్ కోరారు.

Updated Date - 2021-11-11T01:07:52+05:30 IST