కరోనా బారిన పడి కన్నడ డైరెక్టర్ మృతి

ABN , First Publish Date - 2022-01-20T17:44:29+05:30 IST

కరోనా ఉధృతి తగ్గి అన్ని సెట్ అవుతున్నాయి అనుకున్న క్రమంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి...

కరోనా బారిన పడి కన్నడ డైరెక్టర్ మృతి

కరోనా ఉధృతి తగ్గి అన్ని సెట్ అవుతున్నాయి అనుకున్న క్రమంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో సాధారణ ప్రజలతో పాటు వివిధ రంగాల్లోనూ ప్రముఖులు సైతం దీని బారిన పడ్డారు. కన్నడ సినీ పరిశ్రమలో డైరెక్టర్‌గా తనకంటూ స్థానం సంపాదించిన ప్రదీప్ రాజ్ గురువారం ఉదయం కరోనా సోకి కన్నుమూశాడు.


నివేదికల ప్రకారం, ఆయన అంత్యక్రియలు పుదుచ్చేరిలో జరుగుతాయని తెలుస్తోంది. అయితే ఆయన ‘ఈగ’ సినిమాతో తెలుగు రాష్ర్టాల్లో పాపులారిటీ సాధించిన సుదీప్ హీరోగా నటించిన ‘కిచ్చ’, కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న యశ్ నటించిన ‘కిరాతక’కి దర్శకత్వం వహించాడు. కాగా, ఆయన చివరి చిత్రం ‘గిర్గిటల్’ 2019లో విడుదలైంది.

Updated Date - 2022-01-20T17:44:29+05:30 IST