కన్నడ పవర్‌స్టార్ చివరి చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల.. ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్

ABN , First Publish Date - 2022-01-27T21:16:11+05:30 IST

కన్నడలోని నటుల్లో దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే...

కన్నడ పవర్‌స్టార్ చివరి చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల.. ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్

కన్నడలోని నటుల్లో దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. అందుకే ఆయన సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసేవారు అభిమానులు. తాజాగా ఈ కన్నడ పవర్ స్టార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్‌’ ఫస్ట్‌లుక్‌ని ఆయన భార్య, సినిమా నిర్మాత అశ్విని పునీత్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.


గతేడాది అక్టోబర్‌లో పునీత్ గుండెపోటుతో మరణించడం ఆయన అభిమానులను షాక్‌కి గురి చేసింది. అందుకే గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదలైన తాజా చిత్రం పోస్టర్‌పై ఆయన ఫ్యాన్స్ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు. ‘మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం పునీత్ సర్’, ‘మేం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అప్పు సర్’, ‘బాస్‌ని ఇలా చూడడం ఆనందంగా ఉంది’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.




అయితే పునీత్ చనిపోవడానికి ముందే కొన్ని సినిమాలను కమిట్ అయ్యాడు. కొన్ని మూవీస్ చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. కొన్ని మాత్రం షూటింగ్ వివిధ దశల్లో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఈ ‘జేమ్స్’ చిత్రం. ఈ సినిమాని పునీత్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈ మూవీ డైరెక్టర్ చేతన్ కుమార్ తెలిపాడు. అభిమానులను ఉత్సాహ పరిచేందుకే రిపబ్లిక్ డే రోజు ఆర్మీ ఆఫీసర్‌గా పునీత్ లుక్ విడుదల చేసినట్లు చెప్పాడు. మూవీ టీం భావించినట్లుగానే ఈ కన్నడ స్టార్ సైనికుడి వేషధారణలో ఉన్న లుక్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.


కాగా, పునీత్ ‘జేమ్స్’ చిత్రంతో పాటు కమిట్ అయిన మరో మూడు సినిమాలు.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘వన్ కట్ టూ కట్’, ‘ఫ్యామిలీ ఫ్యాక్’ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానున్నాయి.



Updated Date - 2022-01-27T21:16:11+05:30 IST