దేశంలో అత్యంత శక్తిమంతురాలిగా మారిపోయిన Kangana Ranaut!

ABN , First Publish Date - 2021-12-02T20:19:39+05:30 IST

కాంట్రవర్సీని ఇంటి పేరుగా మార్చేసుకున్న కంగనా ‘‘దేశంలో నేనే అత్యంత శక్తిమంతురాలిని’’ అని ప్రకటించేసింది. అయితే, ఇదేదో సెల్ఫ్ డబ్బా అనుకోకండి. ఆమె తనని తాను పొగుడుకోవటం లేదు...

దేశంలో అత్యంత శక్తిమంతురాలిగా మారిపోయిన Kangana Ranaut!

కాంట్రవర్సీని ఇంటి పేరుగా మార్చేసుకున్న కంగనా ‘‘దేశంలో నేనే అత్యంత శక్తిమంతురాలిని’’ అని ప్రకటించేసింది. అయితే, ఇదేదో సెల్ఫ్ డబ్బా అనుకోకండి. ఆమె తనని తాను పొగుడుకోవటం లేదు. తన చుట్టూ రోజురోజుకు పెరుగుతోన్న కేసుల సంగతిని ఉద్దేశించి ఆమె తాజా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేసింది...

‘నేనే మోస్ట్ పవర్‌ఫుల్ ఉమన్’ అంటూ కంగనా చెప్పటానికి కారణం... సుప్రీమ్ కోర్టులో తాజాగా దాఖలైన పీటషన్. అందులో చరణ్‌జీత్ అనే లాయర్ పలు ఆరోపణలు చేశారు. కంగనా సిక్కుల్ని ‘ఖలిస్థానీ ఉగ్రవాదులు’ అంటూ అవమానించిందని ఆయన అన్నారు. మరోవైపు, కంగనా వ్యాఖ్యల వల్ల దేశంలో శాంతిభద్రతలు దెబ్బతింటాయని ఆరోపించారు. మతాల మధ్య విద్వేషం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే, కంగనా సొషల్ మీడియా పోస్టుల్ని సెన్సార్ చేయాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అంతే కాదు, దేశంలో పలుచోట్ల కంగనాపై నమోదైన ఎఫ్ఐఆర్‌లని ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయాలని కూడా లాయర్ చరణ్‌జీత్ కోరారు.
తన మీద సుప్రీమ్ కోర్టులో పిటీషన్ దాఖలైన వార్తని పోస్ట్ చేసిన కంగనా
 ‘‘దేశంలో అత్యంత శక్తిమంతురాలైన మహిళని నేనే’ అంటూ కామెంట్ రాసింది. చూడాలి మరి, ఈ అత్యంత శక్తిమంతురాలి గురించి అత్యున్నత న్యాయస్థానం విచారణ సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో!

Updated Date - 2021-12-02T20:19:39+05:30 IST