‘మూగమనసులు’ షూటింగ్‌లో కె.విశ్వనాధ్‌కు గాయం

ABN , First Publish Date - 2021-05-20T01:37:59+05:30 IST

కె.విశ్వనాధ్ అసోసియేట్ డైరెక్టర్‌గా చేసిన ‘మూగ మనసులు’ షూటింగ్ ఎక్కువ భాగం ఔట్ డోర్‌లో జరిగింది. కొన్ని కీలక సన్నివేశాలు మాత్రం హైదరాబాద్ సారథి స్టూడియోలో చిత్రీకరించారు.

‘మూగమనసులు’ షూటింగ్‌లో కె.విశ్వనాధ్‌కు గాయం

అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘మూగ మనసులు’. ఆదుర్తి సుబ్బారావు ఈ చిత్రానికి దర్శకుడు. కే. విశ్వనాధ్ అసోసియేట్ డైరెక్టర్ ఆ చిత్రానికి. ‘మూగ మనసులు’ షూటింగ్ ఎక్కువ భాగం ఔట్ డోర్‌లో జరిగింది. కొన్ని కీలక సన్నివేశాలు మాత్రం హైదరాబాద్ సారథి స్టూడియోలో చిత్రీకరించారు. 


ఒక రోజు అక్కడ షూటింగ్ జరుగుతోంది. జమున మేకప్ రూంలో మేకప్ వేసుకుంటున్నారు. ఆమెది ఓల్డ్ గెటప్ కావడంతో గెటప్ సరిగ్గా కుదిరిందో లేదో చూడడానికి విశ్వనాధ్ వెళ్లారు. చూసి తిరిగి ఫ్లోర్‌లో అడుగు పెడుతుండగా పై నుంచి కట్టర్ జారీ సరిగ్గా ఆయన తల మీద పడింది. బలంగా పడడంతో దెబ్బ బాగా తగిలి రక్తం కారింది. అది చూసి  సెట్‌లో ఉన్న అక్కినేని, సావిత్రి  కంగారు పడ్డారు. అదేమిటి విశ్వం.. ఇంతలా రక్తం కారుతోంది..అన్నారు అక్కినేని. అంతవరకు ఆ దెబ్బ ని లైట్‌గా తీసుకొన్న విశ్వనాధ్ కూడా అలా అనేసరికి కంగారు పడ్డారు. హుటా హుటిన ఆయన్ని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్ళి కుట్లు వేయించారు.

Updated Date - 2021-05-20T01:37:59+05:30 IST