ఇది బాలీవుడ్ చెల్లిస్తున్న మూల్యం.. Aryan Khan డ్రగ్స్ కేసుపై Javed Akhtar స్పందన!
ABN , First Publish Date - 2021-10-20T17:36:50+05:30 IST
ఇటీవలి కాలంలో బాలీవుడ్ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటోంది
ఇటీవలి కాలంలో బాలీవుడ్ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటోంది. ముఖ్యంగా డ్రగ్స్ కేసులో పలువురు బాలీవుడ్ ప్రముఖులు పట్టుబడుతున్నారు. బాలీవుడ్ను టార్గెట్ చేస్తూ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పనిచేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ స్పందించారు. బాలీవుడ్ వివాదాల గురించి తన మనసులో మాటను వెల్లడించారు.
`అవసరమైన దాని కంటే హై ప్రొఫైల్లో కనబడుతూ బాలీవుడ్ హంగామా చేస్తోంది. దానికి ఇప్పుడు తగిన మూల్యం చెల్లిస్తోంది. నువ్వు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే నిన్ను కిందకు లాగాలని జనం అనుకుంటారు. నీకు ఎలాంటి విలువా లేనపుడు నీపై రాళ్లు విసరాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు. దేశంలోని ఒక పోర్టులో బిలియన్ డాలర్ల విలువ కలిగిన కొకైన్ దొరికొంది. అదే సమయంలో వేరే చోట 1200 మంది లక్ష రూపాయల విలువైన గంజాయితో పార్టీ చేసుకుంటున్నారు. ఈ రెండింటిలో ఏది పెద్ద నేరం. నేను తరచుగా ఆ పార్టీకి సంబంధించిన వార్తలే వింటున్నాను. బిలియన్ డాలర్ల కొకైన్ వార్త నాకెక్కడా కనబడలేద`ని జావేద్ అన్నారు.