Jahvi Kapoor: ‘చోటే మియా’ కు జోడీగా జాన్వీ

ABN , First Publish Date - 2022-10-07T00:13:21+05:30 IST

అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) కూమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor).

Jahvi Kapoor: ‘చోటే మియా’ కు జోడీగా జాన్వీ

అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) కూమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘దఢక్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’, ‘గుడ్ లక్ జెర్రి’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఆమె ఓ క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌కు జోడీగా నటించనుందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.         


బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్ (Akshay Kumar), టైగర్ ష్రాఫ్‌ (Tiger Shroff) హీరోలుగా నటిస్తున్న సినిమా ‘బడే మియా, చోటే మియా’ (Bade Miyan Chote Miyan). అలీ అబ్బాస్ జాఫర్ (Ali Abbas Zafar) దర్శకత్వం వహిస్తున్నాడు. జాకీ భగ్నానీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో టైగర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో అక్షయ్‌కు మాత్రం హీరోయిన్ లేదట. ‘‘టైగర్‌కు హీరోయిన్‌గా జాన్వీ నటించనుంది. ఆమెది చాలా ఆసక్తికరమైన పాత్ర. ఈ పాత్రకు ఆమె అయితేనే సరిపోతుందని అలీ అబ్బాస్ జాఫర్ భావించారు’’ అని చిత్ర బృందానికి చెందిన వ్యక్తి తెలిపారు. ఈ మూవీని యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. రూ.350కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. నవంబర్‌లో షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. క్రిస్‌మస్ కానుకగా 2023లో మూవీని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉంది. డేవిడ్ ధావన్ తెరకెక్కించిన ‘బడే మియా చోటే మియా’ కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. 1998లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, గోవిందా రవీనా టండన్ కీలక పాత్రలు పోషించారు. 

Updated Date - 2022-10-07T00:13:21+05:30 IST