ఆస్కార్స్ అకాడమీలో సూర్య ‘జై భీమ్’ సీన్

ABN , First Publish Date - 2022-01-18T17:21:16+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. తన కెరీర్ లోనే చెప్పుకోదగ్గ రీతిలో రెండో చిత్రాల్లో నటించారు. అందులో ఒకటి డెక్కన్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ బయోపిక్ అయిన ‘సూరారై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) అయితే, మరొకటి తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసిన లాయర్ చంద్రు బయోపిక్ ‘జైభీమ్’ మరొకటి. ఈ రెండు సినిమాలూ ఓటీటీలోనే విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఈ రెండూ భారతీయులు గర్వించదగ్గ సినిమాలుగా నిలిచిపోయాయి. ఇక తాజాగా ‘జైభీమ్’ చిత్రానికి సంబంధించిన అంశం ఒకటి మరో సారి వార్తల్లో నిలిచింది.

ఆస్కార్స్ అకాడమీలో సూర్య ‘జై భీమ్’ సీన్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. తన కెరీర్ లోనే చెప్పుకోదగ్గ రీతిలో రెండు చిత్రాల్లో నటించారు. అందులో ఒకటి డెక్కన్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ బయోపిక్ అయిన ‘సూరారై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) అయితే, మరొకటి తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసిన లాయర్ చంద్రు బయోపిక్ ‘జైభీమ్’ మరొకటి. ఈ రెండు సినిమాలూ ఓటీటీలోనే విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఈ రెండూ భారతీయులు గర్వించదగ్గ సినిమాలుగా నిలిచిపోయాయి. ఇక తాజాగా ‘జైభీమ్’ చిత్రానికి సంబంధించిన అంశం ఒకటి మరో సారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో అందరినీ బాగా కదిలించిన ఓ సన్నివేశం ఆస్కార్స్ యూ ట్యూబ్ ఛానల్ వారు ప్రసారానికి తీసుకున్నారు. 


సినిమా ప్రారంభంలో రిమాండ్ కు వచ్చిన దోషుల్ని పోలీసులు లంచాలు తీసుకొని.. కులాల వారిగా విభజించి  తరలించే సన్నివేశం అందరినీ ఆలోచింపచేసింది. ఆ సీన్ ఇప్పుడు ఆస్కార్స్ వారి యూ ట్యూబ్ ఛానల్ లో ప్రసారమవుతుండడం విశేషంగా మారింది. ఇప్పటి వరకూ ఇది ఏ తమిళ సినిమా విషయంలోనూ జరగలేదు. దీంతో సూర్య అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు. ఇది మన ఇండియన్ సినిమాకే గర్వకారణమని చెప్పాలి.  



Updated Date - 2022-01-18T17:21:16+05:30 IST