Jai Bheem: హీరో, దర్శకుడిపై కేసు కొట్టివేత..
ABN , First Publish Date - 2022-08-12T18:54:09+05:30 IST
‘జైభీమ్’ (Jai Bheem) చిత్రం వ్యవహారంలో హీరో సూర్య (Surya), దర్శకుడు టీజే ఙ్ఞానవేల్ (TJ Gnanavel)లపై నమోదైన కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ
‘జైభీమ్’ (Jai Bheem) చిత్రం వ్యవహారంలో హీరో సూర్య (Surya), దర్శకుడు టీజే ఙ్ఞానవేల్ (TJ Gnanavel)లపై నమోదైన కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ చిత్ర హీరో నిర్మాత అయిన సూర్య, దర్శకుడు ఙ్ఞానవేల్పై సంతోష్ అనే వ్యక్తి వేళచ్చేరి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ సూర్య మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
కాగా, సూర్య ప్రస్తుతం విలక్షణ దర్శకుడు బాలా దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కృతి శెట్టి ఇందులో సూర్య సరసన హీరోయిన్గా నటిస్తోంది. అలాగే, మరికొన్ని చిత్రాలు సెట్స్ మీదకు రాబోతున్నాయి. త్వరలో వీటిని అధికారికంగా ప్రకటించనున్నారు.
సినిమాలోని సన్నివేశాలు వివాదం కాకముందే సినిమా నుంచి తొలగించినట్టు కోర్టుకు అఫిడవిట్ రూపంలో తెలిపారు. దీంతో ఈ కేసులో హీరో, దర్శకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు గతంలో ఆదేశించింది. ఈ నేపథ్యంలో గురువారం మరోమారు ఈ కేసు విచారణకు రాగా, ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు హీరో సూర్య, దర్శకుడు ఙ్ఞానవేల్పై నమోదైన కేసులను కొట్టివేశారు.