సమన్లు జారి, సల్మాన్ చేజారి... చిక్కుల్లో Jacqueline!
ABN , First Publish Date - 2021-12-07T01:50:18+05:30 IST
బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇరు వైపులా ఒత్తిడితో సతమతం అయిపోతోంది. ప్రొఫెషనల్గా ఆమెకు మంచి ఛాన్స్ ఒకటి మిస్సైపోయింది. సల్మాన్ నిర్వహిస్తోన్న ‘దబంగ్’ ఇంటర్నేషనల్ టూర్లో జాక్విలిన్ పాల్గొనాల్సి ఉండగా ఆమె దేశం వదలి వెళ్లలేని స్థితి నెలకొంది. దుబాయ్లో జరిగే ‘దబంగ్’ షో నుంచీ దాదాపుగా ఔటైనట్టే. ఇక మరో వైపు...
బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇరు వైపులా ఒత్తిడితో సతమతం అయిపోతోంది. ప్రొఫెషనల్గా ఆమెకు మంచి ఛాన్స్ ఒకటి మిస్సైపోయింది. సల్మాన్ నిర్వహిస్తోన్న ‘దబంగ్’ ఇంటర్నేషనల్ టూర్లో జాక్విలిన్ పాల్గొనాల్సి ఉండగా ఆమె దేశం వదలి వెళ్లలేని స్థితి నెలకొంది. దుబాయ్లో జరిగే ‘దబంగ్’ షో నుంచీ దాదాపుగా ఔటైనట్టే. ఇక మరో వైపు, పర్సనల్ లైఫ్లోనూ శ్రీలంక సుందరని చట్టపరమైన సమస్యలు చుట్టుముడుతున్నాయి. 200 కోట్ల భారీ మోసానికి పాల్పడిన సుఖేశ్ చంద్రశేఖర్తో ఆమె రిలేషన్ ఇప్పుడు అందరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తోంది. అంతే కాదు, ఎన్స్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీ-టౌన్ స్టార్ని మరోమారు విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది...
జాక్విలిన్ దుబాయ్కి వెళ్లేందుకు ముంబై ఎయిర్పోర్ట్కి చేరుకోగా ఆమెని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆమె ఈడీ సమన్లను పట్టించుకోకుండా పలు మార్లు విచారణకు గైర్హాజరు కావటంతో లుక్ అవుట్ మొదలైంది. అందులో భాగంగానే మిస్ ఫెర్నాండెజ్ని రీసెంట్గా ఇండియా విడిచి వెళ్లకుండా అఫీషియల్స్ అడ్డుకున్నారు. తాజాగా డిసెంబర్ 8న ఢిల్లీలో ఈడీ విచారణకు రావాలని మరోమారు సమన్లు జారీ అయ్యాయి. 200 కోట్ల అక్రమ వసూళ్లు చేసిన సుఖేశ్ చంద్రశేఖర్ అనే నిందుతుడితో జాక్విలిన్కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో దర్యాప్తు సంస్థ ఆమెను విచారించాలనుకుంటోంది. కానీ, కొంత కాలంగా తనకు సుఖేశ్తో ఎలాంటి సంబంధం లేదని చెబుతోన్న జాక్విలిన్ అధికారులకు మాత్రం సహకరించటం లేదు.
వందల కోట్ల హవాలాకు పాల్పడ్డ ఆర్దిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ నుంచీ 10 కోట్ల విలువైన బహుమతులు జాక్విలిన్ ఫెర్నాండెజ్ పొందినట్టు ఆరోపణలు వస్తున్నాయి. 52 లక్షలు విలువ చేసే గుర్రం, 9 లక్షలు విలువ చేసే పిల్లి కూడా జాక్విలిన్కు సుఖేశ్ ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్లో ఉన్నాయట! చూడాలి మరి, ఈడీ సమన్ల జారీ కారణంగా సల్మాన్ టూర్లో మంచి అవకాశం చేజార్చుకున్న ముంబై బ్యూటీ డిసెంబర్ 8న ఢిల్లీకి వెళుతుందో లేదో...