భీమ్లా నాయక్ నుంచి ఐశ్వర్యా రాజేష్ అవుట్

ABN , First Publish Date - 2021-09-18T17:29:38+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ వెర్షన్ గా తెరకెక్కుతున్న

భీమ్లా నాయక్ నుంచి ఐశ్వర్యా రాజేష్ అవుట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి  హీరోలుగా  సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న  క్రేజీ మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ వెర్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే మాటలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ భార్యగా మలయాళ టాలెంటెడ్ భామ నిత్యా మీనన్ నటిస్తున్నట్టు ఇటీవల మేకర్స్ అధికారికంగా తెలిపిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ లో గౌరీ నంద పోషించిన పాత్రను నిత్య చేస్తుండడంతో ఆసక్తి నెలకొంది. 


ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రానా దగ్గుబాటి భార్య గా కూడా మలయాళ భామనే ఎంపిక చేయడం ఆసక్తిగా మారింది. ఆమె పేరు సంయుక్త మీనన్. నిజానికి ఆ పాత్రకోసం ముందుగా ఐశ్వర్యా రాజేశ్ ను ఎంపిక చేయాలనుకున్నారు. అయితే ఆ మెకి కాల్షీట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.  దాంతో మేకర్స్ సంయుక్త మీనన్ ను ఫైనల్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. సంక్రాంతి కానుకగా.. జనవరి 12న విడుదల కాబోతున్న భీమ్లా నాయక్.. అభిమానుల అంచనాల్ని ఏ మాత్రం తగ్గకుండా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ టీజర్ .. రికార్డ్ వ్యూస్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే.. ఈ నెల 20న రానా దగ్గుబాటి పోషిస్తోన్న  డేనియల్ శేఖర్ పాత్ర కు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేయబోతున్నారు. 

Updated Date - 2021-09-18T17:29:38+05:30 IST