Rajinikanth: మణిరత్నంతో కలసి సినిమా చేయబోతున్నారా..?

ABN , First Publish Date - 2022-10-13T01:07:46+05:30 IST

సౌతిండియాలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే నటుల్లో సూపర్‌స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) ఒకరు. ప్రపంచవ్యాప్తంగా రజినీకి వేలాదిసంఖ్యలో అభిమానులున్నారు

Rajinikanth: మణిరత్నంతో కలసి సినిమా చేయబోతున్నారా..?

సౌతిండియాలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే నటుల్లో సూపర్‌స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) ఒకరు. ప్రపంచవ్యాప్తంగా రజినీకి వేలాదిసంఖ్యలో అభిమానులున్నారు. ఇప్పటికి అతడు 169సినిమాలు చేశాడు. తాజాగా రజినీకి సంబంధించిన ఓ వార్త కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తుంది. రజినీ, మణిరత్నం (Mani Ratnam) కలసి సినిమా చేయబోతున్నారంటూ పుకార్లు షికార్లు కొడుతున్నాయి.   


మణిరత్నం దర్శకత్వం వహించిన ‘దళపతి’ (Thalapathy) లో రజినీకాంత్ నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత రజినీ, మణిరత్నం కలసి మరే సినిమాకు పనిచేయలేదు. మణిరత్నం తాజాగా రజినీకి ఓ లైన్‌ను వినిపించారట. ఆ లైన్ ‘తలైవా’ కు బాగా నచ్చిందట. రజినీ స్క్రిఫ్ట్‌ను పూర్తి చేయాలని మణిరత్నంను కోరారట. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ (Ponniyin Selvan 2) విడుదల అయిన అనంతరం ఈ ప్రాజెక్టుపై మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఈ క్లాసిక్ కాంబోను వెండితెర మీద చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘పొన్నియిన్ సెల్వన్’ ఆడియో లాంచ్ ఈవెంట్‌‌కు రజినీ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ‘పొన్నియిన్ సెల్వన్’ లో ఓ పాత్రను ఇవ్వాలని కోరగా మణిరత్నం తిరస్కరించాడని చెప్పాడు.  ఇక రజినీ కాంత్ కెరీర్ విషయానికి వస్తే.. చివరగా ‘పెద్దన్న’ లో నటించాడు. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘జైలర్’ (Jailer) లో నటిస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో రమ్య కృష్ణ, తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు.   

Updated Date - 2022-10-13T01:07:46+05:30 IST