నిర్మాతగా ఇంద్రగంటి మోహన కృష్ణ

ABN , First Publish Date - 2021-08-19T19:17:03+05:30 IST

ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ నిర్మాతగా మారబోతున్నారని తాజా సమాచారం. ప్రస్తుతం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాను రూపొందిస్తున్నారు ఇంద్రగంటి. ఇందులో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటిస్తున్నారు.

నిర్మాతగా ఇంద్రగంటి మోహన కృష్ణ

ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ నిర్మాతగా మారబోతున్నారని తాజా సమాచారం. ప్రస్తుతం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాను రూపొందిస్తున్నారు ఇంద్రగంటి. ఇందులో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటిస్తున్నారు. మహేంద్ర బాబు బి, కిరణ్ బళ్ళపల్లి కలిసి నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. అయితే త్వరలో ఆయన నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కబోతోందని వార్తలు వస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంతో సంతోష్ కాటాను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. బెంచ్‌మార్క్ స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమాను మోహన కృష్ణ నిర్మించనున్నారట. ఇప్పటి వరకు 'గ్రహణం', 'అష్టాచెమ్మ', 'గోల్కొండ హైస్కూల్', 'అంతకుముందు ఆ తర్వాత', 'జెంటిల్ మేన్', 'సమ్మోహనం', 'వి' వంటి విభిన్నమైన చిత్రాలను అందించి టాలీవుడ్‌లో దర్శకుడుగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఇప్పుడు నిర్మాతగా మారబోతుండటం ఆసక్తికరం. చూడాలి మరి ఇంద్రగంటి నిర్మాతగా ఏ మేరకు సక్సెస అవుతారో.  

Updated Date - 2021-08-19T19:17:03+05:30 IST