రూమర్లను సరదాగా తీసుకున్నాం -ఇళయరాజా

ABN , First Publish Date - 2021-09-26T06:58:16+05:30 IST

తనకు, ఎస్పీబీకి మధ్య ఏవేవో మనస్పర్థలు ఉన్నట్టు దుష్ప్రచారం చేశారని, వాటన్నింటినీ తాము సరదాగా తీసుకున్నామని ఇసైఙ్ఞాని ఇళయరాజా అన్నారు. ఎస్పీబీ తొలి వర్థంతిని పురస్కరించుకుని శనివారం చెన్నైలోని సినీ మ్యుజీషియన్స్‌....

రూమర్లను సరదాగా తీసుకున్నాం -ఇళయరాజా

తనకు, ఎస్పీబీకి మధ్య ఏవేవో మనస్పర్థలు ఉన్నట్టు దుష్ప్రచారం చేశారని, వాటన్నింటినీ తాము సరదాగా తీసుకున్నామని ఇసైఙ్ఞాని ఇళయరాజా అన్నారు. ఎస్పీబీ తొలి వర్థంతిని పురస్కరించుకుని శనివారం చెన్నైలోని సినీ మ్యుజీషియన్స్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇళయరాజా ముఖ్య అతిథిగా హాజరై... ఎస్పీబీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన ఎస్పీబీకి, తనకు ఉన్న అనుబంధం ప్రత్యేకమైనదన్నారు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా తననెంతో బాధించిందన్నారు. తామిద్దరం సంగీత కళాకారులుగా కంటే మంచి స్నేహితులుగా ఉండిపోయామన్నారు. తమ మధ్య మనస్పర్థలు ఉన్నట్టు రూమర్లు సృష్టించారన్నారు. కానీ, వీటి గురించి తాము ఎన్నడూ చర్చించుకోవడం, లేదా ఫోను చేసి మాట్లాడుకున్న సందర్భం లేదన్నారు. పైగా ఇలాంటి రూమర్లను తాము సరదాగా తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి వాసూరావు తదితరులు పాల్గొని ఎస్పీబీకి నివాళులు అర్పించారు. 

Updated Date - 2021-09-26T06:58:16+05:30 IST