‘పుష్పరాజ్’ క్రేజ్ తగ్గేదేలే!
ABN , First Publish Date - 2022-01-20T19:06:17+05:30 IST
ఐకాన్స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రం విడుదలై నెల కావొస్తున్నా.. సినిమా క్రేజ్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఉంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్పటికీ పలు చోట్ల సక్సెస్ఫుల్గా ఆడుతోంది. అయితే ఈ చిత్రానికి నెట్టింట కూడా మామూలు క్రేజ్ లేదు. ఇప్పటికే ఈ చిత్రంలో పాటలకు పలువురు సెలబ్రిటీలు స్టెప్పులేసి అలరించారు. ప్రముఖ డైరీ అమూల్ కూడా ఫిదా అయ్యి ‘పుష్పక్ ద స్లైస్’ పేరుతో ఓ సరికొత్త పోస్టర్ను విడుదల చేసి చిత్ర బృందాన్ని అభినందించారు.
ఐకాన్స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రం విడుదలై నెల కావొస్తున్నా.. సినిమా క్రేజ్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఉంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్పటికీ పలు చోట్ల సక్సెస్ఫుల్గా ఆడుతోంది. అయితే ఈ చిత్రానికి నెట్టింట కూడా మామూలు క్రేజ్ లేదు. ఇప్పటికే ఈ చిత్రంలో పాటలకు పలువురు సెలబ్రిటీలు స్టెప్పులేసి అలరించారు. ప్రముఖ డైరీ అమూల్ కూడా ఫిదా అయ్యి ‘పుష్పక్ ద స్లైస్’ పేరుతో ఓ సరికొత్త పోస్టర్ను విడుదల చేసి చిత్ర బృందాన్ని అభినందించారు. హీరోహీరోయిన్ల పాత్రలను పోలి ఉండేలా కార్టూన్స్ను డిజైన్ చేసి సర్ప్రైజ్ చేశారు. అమూల్ టాపికల్ సరికొత్త యాక్షన్ డ్రామా మూవీ భారీ హిట్’ అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది. ఇక ఈ పోస్ట్కు ‘అముల్ అర్జున్’ అంటూ క్యాప్షన్ ఇవ్వడం ఆసక్తికరం. ప్రస్తుతం నెట్టింట ఇవన్నీ వైరల్ అవుతుండగా కేరళ నుంచి మరో సర్ప్రైజ్ బయటికొచ్చింది.
కేరళలోనూ ట్రెండ్...
కేరళలో అల్లు అర్జున్కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా. అతన్ని అంతా మల్లూ అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు కేరళ అభిమానులు. తాజాగా విడుదలైన ‘పుష్ప’ చిత్రం కేరళలో కూడా సక్సెస్ఫుల్గా నడుస్తోంది. అక్కడ ఓ ఉత్సవంలో ఈ చిత్రంలోని ‘సామీ సామీ’ పాట హల్చల్ చేసింది. కేరళ సంప్రదాయంలో ఒకటైన సింగారి మేళం బృందం ఓ వేడుకలో ‘సామీ సామీ’ పాటను వాయించి అలరించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
అవగాహనకూ వాడేశారు..
తాజాగా మరో మీమ్ నెట్టింట వైరల్ అవుతుంది. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో కరోనా అవగాహన కోసం ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ శాఖ ఆసక్తికర మీమ్ క్రియేట్ చేసి పోస్ట్ చేసింది. అందులో పుష్పలోని అల్లు అర్జున్ స్టిల్కు ఫొటోషాప్లో మాస్క్ అతికించి పోస్ట్ చేశారు. దానిపై ‘పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే’ అంటూ... ‘అది డెల్టా వేరియంట్ అయినా, ఓమిక్రాన్ అయినా మాస్క్ తీసేదేలే’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని బట్టి ఈ చిత్రం ప్రభావం జనాల్లో ఎంతగా ఉందో తెలుస్తోంది. ఈ చిత్రానికి కొనసాగింపు కూడా తెరకెక్కనుంది. ఈ ఏడాదిలోనే ‘పుష్ప–2’ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.