'పక్కా కమర్షియల్' కోసం భారీ సెట్..!

ABN , First Publish Date - 2021-12-07T17:51:43+05:30 IST

మ్యాచో హీరో గోపీచంద్ - బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పక్కా కమర్షియల్'. మారుతి ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్,

'పక్కా కమర్షియల్' కోసం భారీ సెట్..!

మ్యాచో హీరో గోపీచంద్ - బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పక్కా కమర్షియల్'. మారుతి ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో గోపీచంద్ - రాశీ ఖన్నా లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. ప్రస్తుతం 'పక్కా కమర్షియల్' సినిమాలోని ఓ పాటను చిత్రీకరిస్తున్నారట. దీని కోసం ఏకంగా రూ. 1.50 లక్షలతో ప్రత్యేకంగా ఓ సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ మూవీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు జీఏ2 సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి SKN సహ నిర్మాత. 

Updated Date - 2021-12-07T17:51:43+05:30 IST