మొదటిసారి మంగళ సూత్రం ధరించినప్పుడు.. Priyanka Chopra మదిలో కలిగిన భావాలు ఏంటో తెలుసా..

ABN , First Publish Date - 2022-01-18T17:56:02+05:30 IST

బాలీవుడ్‌లో వరుస టాప్ హీరోలతో సినిమాలు చేసిన టాప్ హీరోయిన్‌గా ఎదిగిన నటి ప్రియాంక చోప్రా.

మొదటిసారి మంగళ సూత్రం ధరించినప్పుడు.. Priyanka Chopra మదిలో కలిగిన భావాలు ఏంటో తెలుసా..

బాలీవుడ్‌లో వరుస టాప్ హీరోలతో సినిమాలు చేసిన టాప్ హీరోయిన్‌గా ఎదిగిన నటి ప్రియాంక చోప్రా. అనంతరం హలీవుడ్‌లో పాగా వేసిన ఈ భామ అక్కడ సైతం మంచి పాపులారిటీనే సాధించింది. అయితే 2018లో రాజస్థాన్‌లో పాప్ సింగర్, నటుడు నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.


హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం జరిగిన వీరి వివాహం అప్పట్లో అందరిలో ఎంతో చర్చకు దారితీసింది. అయితే తాజాగా ఓ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా మొదటిసారి మంగళ సూత్రం ధరించినప్పుడు తన మదిలో మెదిలినా భావాల గురించి వివరించింది ఈ ప్రియాంక.


అందులో ఆమె మాట్లాడుతూ.. ‘నేను మొదటి సారి మంగళ సూత్రం ధరించిన సమయం నాకు గుర్తుంది. ఎందుకంటే మాకు దాని విలువ ఏంటో చెబుతూ పెంచారు. అది నాకు ఎంతో ప్రత్యేకమైన క్షణం. అదే సమయంలో, ఒక ఆధునిక మహిళగా, దాని ధరించే వల్ల వచ్చే పరిణామాలను కూడా నేను అర్థం చేసుకున్నాను. మంగళసూత్రం ధరించడం నాకు నచ్చిందా లేదా లేక అది పితృస్వామ్య వ్యవస్థకి నిదర్శనమా? అనేది నాకు తెలియదు. కానీ ఈ వాదన నడుస్తున్న సమయంలో అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాను. సంప్రదాయాన్ని గౌరవించండి.. కానీ మీరు ఎవరో, మీకు ఏం కావాలో తెలుసుకోండి. అంతేకాకుండా మన తరువాతి తరం అమ్మాయిలు  ఇంకా భిన్నంగా చేయడాన్ని మనం చూస్తాం’ అని చెప్పుకొచ్చింది.


అంతేకాకుండా ఆ వీడియోకి.. ‘ఖచ్చితంగా ఇదో ఒక సంభాషణకి మూలం. లూసియా సిల్వస్ట్రీ ఎంతో ప్రేమతో, గౌరవంతో రూపొందించిన అందమైన మంగళ సూత్రం ఇది. సంప్రదాయాలను పాటించండి.. నేను ప్రయత్నిస్తున్నాన‌’ని క్యాప్షన్ రాసుకొచ్చింది.



Updated Date - 2022-01-18T17:56:02+05:30 IST