ఆ మూవీపైనే ఆశలన్నీ పెట్టుకున్న శర్వానంద్

ABN , First Publish Date - 2021-10-17T20:26:52+05:30 IST

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ పేరు ముందు వరుసలో ఉంటుంది. విభిన్నతరహా కథలు ఎంచుకోవడం, వైవిధ్యమైన పాత్రలు పోషించడం ఆయన స్టైల్. అయితే ‘మహానుభావుడు’ మూవీ తర్వాత శర్వానంద్ అసలు హిట్టు ముఖమే చూడలేదు. ఆ సినిమా తర్వాత వచ్చిన ‘పడిపడిలేచె మనసు, రణరంగం, జాను, శ్రీకారం’ లాంటి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అందివ్వలేకపోయాయి.

ఆ మూవీపైనే ఆశలన్నీ పెట్టుకున్న శర్వానంద్

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ పేరు ముందు వరుసలో ఉంటుంది. విభిన్నతరహా కథలు ఎంచుకోవడం, వైవిధ్యమైన పాత్రలు పోషించడం ఆయన స్టైల్. అయితే ‘మహానుభావుడు’ మూవీ తర్వాత శర్వానంద్ అసలు హిట్టు ముఖమే చూడలేదు. ఆ  సినిమా తర్వాత వచ్చిన ‘పడిపడిలేచె మనసు, రణరంగం, జాను, శ్రీకారం’ లాంటి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అందివ్వలేకపోయాయి. ఆఖరికి అజయ్ భూపతి ‘మహాసముద్రం’ కూడా నిరాశపరచడంతో.. ప్రస్తుతం శర్వానంద్ ఆశలన్నీ ఒకే ఒక సినిమా మీదున్నాయి. 



కిశోర్ తిరుమల దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ మూవీ మాత్రమే శర్వాకు హోప్ గా మిగిలింది. ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమన్ రిలేషన్స్ బేస్డ్ గా సాగే ఈ సినిమాలో రష్మికా మందణ్ణ కథానాయికగా నటిస్తోంది. రాధిక, ఊర్వశి, ఖుష్బూ లాంటి నిన్నటి తరం హీరోయిన్స్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫ్యామిలీ హీరోగా శర్వానంద్ కు మంచి ఇమేజ్ ఉంది. అలాగే.. లేడీస్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. అందుకే ఈ సినిమాపై తన ఆశలన్నీ పెట్టుకున్నాడు శర్వానంద్. మరి ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా శర్వా కెరీర్ ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.  

Updated Date - 2021-10-17T20:26:52+05:30 IST