డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 'గల్లీ రౌడీ'..
ABN , First Publish Date - 2021-10-24T13:10:50+05:30 IST
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన 'గల్లీ రౌడీ' చిత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. కామెడీ చిత్రాల డైరెక్టర్ జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నేహా శెట్టి హీరోయిన్గా నటించింది.

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన 'గల్లీ రౌడీ' చిత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. కామెడీ చిత్రాల డైరెక్టర్ జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నేహా శెట్టి హీరోయిన్గా నటించింది. బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణమురళి, వైవా హర్ష, రాజేంద్ర ప్రసాద్, స్నేహ గుప్త తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 17న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. కోన వెంకట్ సమర్పణలో, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమాను ఈ దీపావళి పండుగ సందర్భంగా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్గా రాబోతోంది.