Pushpa the rise : గ్రాండ్ ఈవెంట్‌కు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-12-07T19:00:50+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ నెల 17న విడుదల కాబోతోంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్ని జోరుగా చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న (సోమవారం) ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది. అందులోని బన్నీ మాస్ అపీరెన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Pushpa the rise : గ్రాండ్ ఈవెంట్‌కు సర్వం సిద్ధం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ నెల 17న విడుదల కాబోతోంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్ని జోరుగా చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న (సోమవారం) ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది.  బన్నీ మాస్ అపీరెన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇంకో పదిరోజుల్లో సినిమా విడుదల కానుండడంతో.. ప్రీరిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. దీనికి యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదిక కానుంది. ఈ నెల 12న ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతోంది. 


నిజానికి ఈ ఈవెంట్ ను దుబాయ్ లో ప్లాన్ చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా.. అక్కడ నిర్వహించడం సేఫ్ కాదనుకొని నిర్మాతలు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీంతో హైదరాబాద్ లోనే గ్రాండ్ ఈవెంట్ ను జరపబోతున్నారు. రష్మికా కథానాయికగా నటిస్తుండగా, సమంత స్పెషల్ సాంగ్ లో నర్తించబోతోంది. అలాగే.. అనసూయ ఓ డిఫరెంట్ పాత్రను చేస్తోంది. ఫహద్ ఫాజిల్, సునీల్ విలన్ పాత్రల్లో మెప్పించబోతున్నారు. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ‘పుష్ప’ మూవీ బన్నీకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి. 

Updated Date - 2021-12-07T19:00:50+05:30 IST