ప్రభుత్వం వెంటనే జీఎస్టీని ఎత్తివేయాలి: పూనమ్ కౌర్

ABN , First Publish Date - 2022-01-19T14:30:30+05:30 IST

ప్రభుత్వం వెంటనే జీఎస్టీని ఎత్తివేయాలని నటి పూనమ్ కౌర్ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆమె విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

ప్రభుత్వం వెంటనే జీఎస్టీని ఎత్తివేయాలి: పూనమ్ కౌర్

ప్రభుత్వం వెంటనే జీఎస్టీని ఎత్తివేయాలని నటి పూనమ్ కౌర్ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆమె విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా చేనేత వర్గాలు బాగుండాలని శ్రీవారిని ప్రార్దించానని...ప్రభుత్వం వెంటనే జీఎస్టీని ఎత్తివెయ్యాలని పూనమ్ డిమాండ్ చేశారు. మొదటి సారి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నానని...దర్శనం అద్భుతంగా జరిగిందన్నారు. తిరుమల నుంచి కంచికి వెళ్ళి అమ్మ వారిని దర్శించుకుంటానని ఆమె తెలిపారు.  

Updated Date - 2022-01-19T14:30:30+05:30 IST