Radhakrishna కు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్..?

ABN , First Publish Date - 2022-06-17T17:02:53+05:30 IST

రాధాకృష్ణ కుమార్ (Radha Krishnakumar), మాచో హీరో గోపీచంద్ (Gopichand) కలిసి మళ్ళీ సినిమా చేయబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Radhakrishna కు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్..?

రాధాకృష్ణ కుమార్ (Radha Krishnakumar), మాచో హీరో గోపీచంద్ (Gopichand) కలిసి మళ్ళీ సినిమా చేయబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో వీరిద్దరూ కలిసి 'జిల్' (Jil) మూవీతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్నారు. దర్శకుడిగా మొదటి సినిమాతోనే ప్రభాస్‌ను ఆకట్టుకున్నాడు రాధాకృష్ణ. అందుకే, గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా నటించిన 'జిల్' సినిమా మేకర్స్ యువి క్రియేషన్స్ (UV Creations) వారు ఏకంగా ప్రభాస్‌ (Prabhas)తో సినిమా చేసే అవకాశం ఇచ్చారు.


ఆ సినిమానే రాధే శ్యామ్. ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలై అందరినీ తీవ్రంగా నిరాశపరించింది. దాదాపు 100 కోట్లకు పైగానే నష్టాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. దాంతో ఇప్పుడు రాధాకృష్ణ తన మొదటి హీరో గోపీచంద్‌తో కలిసి సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట. ప్రస్తుతం గోపీచంద్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమాను చేశాడు. రాశీఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఈ క్రమంలోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రాధాకృష్ణ, గోపీచంద్‌కు లైన్ వినిపించాడట. అది నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్‌తో రమ్మని చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు చేస్తున్న పక్కా కమర్షియల్ సినిమా పక్కన పెడితే ఇటీవల గోపీచంద్ హీరోగా నటించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. దాంతో సాలీడ్ హిట్ కోసం గోపీ కూడా మంచి కసి మీదున్నాడు. మరి 'జిల్' లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడితో మళ్ళీ సినిమా చేసేందుకు ఒకే చెప్తాడా లేదా చూడాలి. ఒకవేళ రాధాకృష్ణకు గోపీచంద్ ఒకే చెప్తే మాత్రం ఈసారి హిట్ కొట్టేస్తారని చెప్పుకుంటున్నారు. 

Updated Date - 2022-06-17T17:02:53+05:30 IST