కొత్త తరహా కథనంతో ‘తెలిసినవాళ్లు’

ABN , First Publish Date - 2022-09-29T05:35:05+05:30 IST

రామ్‌కార్తిక్‌, హెబ్బాపటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘తెలిసినవాళ్లు. విప్లవ్‌ కోనేటి దర్శకత్వంలో కేఎస్వీ ఫిల్మ్స్‌, సిరెంజ్‌ సినిమా బేనర్‌లో...

కొత్త తరహా కథనంతో ‘తెలిసినవాళ్లు’

రామ్‌కార్తిక్‌, హెబ్బాపటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘తెలిసినవాళ్లు’. విప్లవ్‌ కోనేటి దర్శకత్వంలో కేఎస్వీ ఫిల్మ్స్‌, సిరెంజ్‌ సినిమా బేనర్‌లో తెరకెక్కుతోంది. సీనియర్‌ నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. టీజర్‌కు మంచి స్పందన వస్తుందని.. రొమాన్స్‌, ఫ్యామిలీ, థ్రిల్లర్‌ జోనర్స్‌ కలసిన ఒక కొత్త తరహా కథనంతో రూపొందుతున్న చిత్రం ఇదని దర్శకుడు తెలిపారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల

Updated Date - 2022-09-29T05:35:05+05:30 IST