'గుడ్ లక్ సఖి': ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా రామ్ చరణ్
ABN , First Publish Date - 2022-01-26T18:37:58+05:30 IST
'గుడ్ లక్ సఖి' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరవనున్నారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు నగేష్ కుకునూరు దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు.
'గుడ్ లక్ సఖి' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరవనున్నారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు నగేష్ కుకునూరు దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. ఇందులో కీర్తి సురేష్ షూటర్గా కనిపించనుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'గుడ్ లక్ సఖి' చిత్రాన్ని 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. నేడు (జనవరి 24) పార్క్ హయత్లో సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరవనున్నారు. వాస్తవంగా మెగాస్టార్ ఈ గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరవ్వాల్సి ఉంది. అయితే, ఆయన కరోనా బారిన పడిన నేపథ్యంలో ఆ స్థానంలో చిరుకు బదులు ఆయన తనయుడు చరణ్ విచ్చేయనున్నారు.