Rashmika Mandanna: మాజీలందరు స్నేహితులే.. విజయ్‌తో బంధంపై పెదవి విప్పిన నటి..

ABN , First Publish Date - 2022-10-01T20:11:01+05:30 IST

ఏ పాత్రను అయినా అలవోకగా పోషించే నటి రష్మిక మందన్న (Rashmika Mandanna). ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ గా పేరు తెచ్చుకుంది. ‘పుష్ప’ తో ఇండియా అంతట క్రేజ్ సంపాదించుకుంది.

Rashmika Mandanna: మాజీలందరు స్నేహితులే.. విజయ్‌తో బంధంపై పెదవి విప్పిన నటి..

ఏ పాత్రను అయినా అలవోకగా పోషించే నటి రష్మిక మందన్న (Rashmika Mandanna). ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ గా పేరు తెచ్చుకుంది. ‘పుష్ప’ తో ఇండియా అంతట క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో శ్రీ వల్లీగా కనిపించి యూత్‌ను మెస్మరైజ్ చేసింది. తాజాగా ఆమె ‘గుడ్ బై’ (Goodbye) లో నటించింది. ఈ సినిమా అక్టోబర్ 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రష్మిక ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. అందులో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక సంగతులను అభిమానులతో పంచకుంది. తన మాజీ బాయ్ ఫ్రెండ్స్‌తో ఇప్పటికి టచ్‌లో ఉన్నానని చెప్పింది. 


తన బాయ్ ఫ్రెండ్స్ కొత్త సహచరులను కూడా చూడటానికి సిద్ధంగా ఉన్నట్టు రష్మిక మందన్న పేర్కొంది. ‘‘నా మాజీ బాయ్ ఫ్రెండ్స్ అందరు కూడా స్నేహితులే. వారి కుటుంబాలను కూడా ఇప్పటికి నేను కలుసుకుంటుటాను. ఇప్పటికి వారి కుటుంబాలతో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి’’ అని రష్మిక మందన్న తెలిపింది. అయితే,  విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)తో కలసి ఆమె గీత గోవిందం (Geetha Govindam), డియర్ కామ్రేడ్ (Dear Comrade) లో నటించింది. దీంతో వీరిద్దరు రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నారని కొంత కాలంగా పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ వదంతులపై రష్మిక స్పందించింది. ‘‘మా కెరీర్ ప్రారంభంలో నేను, విజయ్ కలసి అనేక సినిమాలు చేశాం. అప్పట్లో మాకు ఇండస్ట్రీ గురించి అవగాహన లేదు. మా ఇద్దరి మనస్తత్వాలు ఒకే విధంగా ఉండటంతో స్నేహితులుగా మారాం. హైదరాబాద్‌లో నాకొక గ్యాంగ్ ఉంది. విజయ్‌కొక గ్యాంగ్ ఉంది. మా ఇద్దరికి అనేక మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందువల్ల ప్రపంచమంతా మా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. వాటిని చూస్తే చాలా క్యూట్‌గా అనిపిస్తుంది’’ అని రష్మిక స్పష్టం చేసింది. ఇక రష్మిక మందన్న కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్ సినిమా మిషన్ మజ్ను షూటింగ్‌ను గతంలోనే పూర్తి చేసింది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. కోలీవుడ్ హీరో విజయ్ సరసన ‘వారసుడు’ లో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం బై లింగ్విల్‌గా రూపొందుతుంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2022-10-01T20:11:01+05:30 IST