‘మైఖేల్‌’ కోసం..

ABN , First Publish Date - 2022-01-21T10:03:06+05:30 IST

సందీప్‌ కిషన్‌, విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘మైఖేల్‌’’ లో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఓ ముఖ్య పాత్ర...

‘మైఖేల్‌’ కోసం..

సందీప్‌ కిషన్‌, విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘మైఖేల్‌’’ లో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారని చిత్ర నిర్మాతలు భరత్‌ చౌదరి, పుస్కర్‌ రామ్‌ మోహన్‌రావు చెప్పారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రానికి రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్‌ కిషన్‌ సరసన దివ్యాంక కౌశిక్‌ కథానాయికగా నటిస్తున్నారు. నటుడిగానూ తన ప్రతిభను ప్రదర్శిస్తున్న తమిళ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానుంది. నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌ ఈ చిత్రానికి సమర్పకుడు.


Updated Date - 2022-01-21T10:03:06+05:30 IST