ఫీల్ గుడ్ ప్రేమకథగా.. ‘ఏడ తానున్నాడో’

ABN , First Publish Date - 2021-12-05T00:57:08+05:30 IST

‘ఏడ తానున్నాడో’ మూవీ ఫీల్ గుడ్ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంతో దిల్ రాజు బ్యానర్‌లో రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో 8 ఏళ్లుగా పనిచేస్తున్న దొండపాటి వంశీ కృష్ణ దర్శకుడిగా..

ఫీల్ గుడ్ ప్రేమకథగా.. ‘ఏడ తానున్నాడో’

‘ఏడ తానున్నాడో’ మూవీ ఫీల్ గుడ్ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంతో దిల్ రాజు బ్యానర్‌లో రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో 8 ఏళ్లుగా పనిచేస్తున్న దొండపాటి వంశీ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తనిష్కా మల్టీ విజన్స్ బ్యానర్‌పై గుజ్జా యుగందర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదల కానున్న ఈ చిత్రం నుండి తాజాగా మేకర్స్ ట్రైలర్‌ని విడుదల చేశారు.


ఈ సందర్భంగా దర్శకుడు వంశీ కృష్ణ దొండపాటి మాట్లాడుతూ.. ‘‘ ఇది రోడ్ ట్రిప్ బేసెడ్ ఎమోషనల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరి. వికారాబాద్ ఫారెస్ట్, శ్రీశైలం ఫారెస్ట్, బెంగళూర్, మైసూర్, కూర్గ్ హిల్ స్టేషన్.. ఇలా పలు అద్భుతమైన లొకేషన్‌లలో చిత్రీకరించాము. చరణ్ అర్జున్ అందించిన ఫీల్ గుడ్ మ్యూజిక్, ఎమోషనల్ మెలోడీస్ ప్రేక్షకులని అలరిస్తాయి. ఇప్పటి వరకు ప్రేక్షకులు ప్రియురాలి కోసం ప్రియుడు వెతికే ప్రేమ కథలను చూశారు. మొట్టమొదటిసారి తాను ప్రేమించిన ప్రియుడి కోసం, అతని జ్ఞాపకాల దారుల్లో వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న భగ్న ప్రేయసి కథ ఇది. అడ్వెంచర్ థ్రిల్లర్ సంఘటనలతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. బాలు చిత్రంలో జూనియర్ పవన్ కళ్యాణ్‌గా నటించిన అభినవ్ మణికంఠ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. స్వేచ్ఛాయుత జీవితంలో ఒక స్వచ్ఛమైన ప్రియురాలిగా కోమలి ప్రసాద్ నటన సినిమాకే హైలైట్‌గా ఉంటుంది. విడుదలైన ట్రైలర్‌కు చాలా మంచి స్పందన వస్తుంది. త్వరలోనే విడుదల వివరాలను తెలియజేస్తాము..’’ అని తెలిపారు. 

Updated Date - 2021-12-05T00:57:08+05:30 IST