ఫ్రమ్ పాకిస్తాన్ వయా చైనా
ABN , First Publish Date - 2021-09-28T05:07:52+05:30 IST
సంహిత, భావన, మధురిమ తదితరులు నటించిన ‘ఫాతిమా’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తోట కృష్ణ దర్శకత్వంలో చండ్ర మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఫ్రమ్ పాకిస్తాన్ వయా చైనా’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం....
సంహిత, భావన, మధురిమ తదితరులు నటించిన ‘ఫాతిమా’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తోట కృష్ణ దర్శకత్వంలో చండ్ర మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఫ్రమ్ పాకిస్తాన్ వయా చైనా’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో చదలవాడ శ్రీనివాసరావు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, ముత్యాల రామదాసు, మోహన్ వడ్లపట్ల, చంద్రశేఖర్, ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘ఫాతిమా’ చిత్రం విజయం సాధించాలనీ, నిర్మాతకు లాభాలు రావాలనీ అతిథులు కోరారు.
విజయదశమి సందర్భంగా ఈ చిత్రాన్ని వచ్చే నెల విడుదల చేస్తున్నామనీ, అదే రోజు ప్రసాద్రెడ్డి దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తామనీ నిర్మాత చండ్ర మధు చెప్పారు. సినిమా బాగా వచ్చిందనీ, విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందనీ దర్శకుడు తోట కృష్ణ చెప్పారు.