భావోద్వేగం కలిగించే అడవితల్లి పాట

ABN , First Publish Date - 2021-12-05T10:31:45+05:30 IST

పవన్‌కల్యాణ్‌, రానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. ఇందులోని ‘కిందున్న మడుసలకా కోపాలు తెమలవు.. పైనున్న సామేమో కిమ్మని పలకడు’ అంటూ సాగే గీతాన్ని...

భావోద్వేగం కలిగించే అడవితల్లి పాట

పవన్‌కల్యాణ్‌, రానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. ఇందులోని ‘కిందున్న మడుసలకా కోపాలు తెమలవు.. పైనున్న సామేమో కిమ్మని పలకడు’ అంటూ సాగే గీతాన్ని శనివారం విడుదల చేశారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ‘ఈ పాట రాసిన వెంటనే మా గురువు సీతారామశాస్త్రిగారికి వినిపించాను. చాలా బాగుందని అభినందించి ఆశీర్వదించారు. కథానుసారం ఓ కీలక సందర్భంలో అందరినీ భావోద్వేగం కలిగించే ఓ మంచి పాటను రాసే అవకాశం నా అదృష్టం’ అన్నారు. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకొన్న ఈ చిత్రానికి మాటలు, స్ర్కీన్‌ప్లే: త్రివిక్రమ్‌, నిర్మాత:సూర్యదేవర నాగవంశీ, దర్శకత్వం: సాగర్‌ కె చంద్ర. 


Updated Date - 2021-12-05T10:31:45+05:30 IST