రొమాన్స్ శృతి మించడంతో ఓటీటీలో విడుదలకు సిద్ధమైన Deepika Padukone సినిమా

ABN , First Publish Date - 2021-12-04T21:20:57+05:30 IST

సెన్సార్ బోర్డుతో ఇబ్బందులు తలెత్తుతాయని భావించడంతో ఒక బాలీవుడ్ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది

రొమాన్స్ శృతి మించడంతో ఓటీటీలో విడుదలకు సిద్ధమైన Deepika Padukone సినిమా

సెన్సార్ బోర్డుతో ఇబ్బందులు తలెత్తుతాయని భావించడంతో ఒక బాలీవుడ్ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. శృతి మించి రొమాన్స్ ఉండటంతో సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయాలనుకుంటున్నారని బీ టౌన్‌‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


దీపికా పదుకొణె, అనన్య పాండే, సిద్దాంత్ చతుర్వేది నటీనటులుగా ఒక సినిమా తెరకెక్కుతోంది. శకున్ బత్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో సినిమా చిత్రీకరణ మొదలైంది. షూటింగ్ ప్రారంభమై చాల కాలమైనప్పటికి  సినిమా  టైటిల్‌‌ను ఇంతవరకు ప్రకటించలేదు. ఈ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే విడుదల చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది.  ‘‘దీపికా పదుకొణె, అనన్య పాండే  అక్క, చెల్లెళ్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. దీపిక ఫిట్‌నెస్ ట్రైనర్ పాత్రను పోషిస్తోంది. వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. చిత్రంలో అధిక మోతాదులో రొమాన్స్ ఉంది. థియేటర్లల్లో విడుదల చేయాలంటే సెన్సార్ సర్టిఫికేట్ కావాలి. సెన్సార్ బోర్డు దగ్గరికి వెళితే ఈ సినిమాలోని అనేక సీన్లకు కత్తెర పడే అవకాశం ఉంది. ఆ సీన్లను తీసివేస్తే దాని ప్రభావం సినిమా మొత్తం మీద ఉంటుంది. ఓటీటీలో అయితే సెన్సార్ ఉండదు కాబట్టి సినిమాను అక్కడే విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. సినిమా హాళ్లల్లో విడుదల చేయకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తే లాభం ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు ’’ అని సినిమాకు సంబంధించిన ఒక వ్యక్తి చెప్పారు. 


ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2022లో విడుదలయ్యే అవకాశం ఉంది. 

Updated Date - 2021-12-04T21:20:57+05:30 IST