పదేళ్ల తర్వాత నా కల నెరవేరింది.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన హీరోయిన్ Mamta Mohandas పోస్ట్
ABN , First Publish Date - 2021-09-24T22:40:32+05:30 IST
‘పదేళ్ల తర్వాత నా కల నెరవేరింది. ఈ క్షణం కోసం నేను ఎంతో కాలం ఎదురుచూశా.. ఎట్టకేలకు ఈ రోజు నా ఆశ నెరవేరింది.’.. ఇదీ సోషల్ మీడియాలో ప్రముఖ హీరోయిన్ మమతా మోహన్ దాస్ పెట్టిన పోస్ట్.. ఇంతకీ ఆ కల ఏంటన్నదే కదా మీ అనుమానం. ఆమె ఇటీవలే ఓ కారును కొనుగోలు చేసింది.
బెంగళూరు: ‘పదేళ్ల తర్వాత నా కల నెరవేరింది. ఈ క్షణం కోసం నేను ఎంతో కాలం ఎదురుచూశా.. ఎట్టకేలకు ఈ రోజు నా ఆశ నెరవేరింది.’.. ఇదీ సోషల్ మీడియాలో ప్రముఖ హీరోయిన్ మమతా మోహన్ దాస్ పెట్టిన పోస్ట్.. ఇంతకీ ఆ కల ఏంటన్నదే కదా మీ అనుమానం. ఆమె ఇటీవలే ఓ కారును కొనుగోలు చేసింది. దాని గురించి ఆనందం వ్యక్తం చేస్తూనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇంతకీ మమతా మోహన్ దాస్ ఏం చెప్తోందంటే...
‘‘ ఈ రోజు కల నిజమైంది. ఈ కారు కోసం దశాబ్దానికి పైగా ఎదురు చూశాను. మా కుటుంబంలోకి కొత్తగా వచ్చిన బేబిని మీకు చూపిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. సన్షైన్ ఎల్లో కలర్లో ఉన్న కారుతో దిగిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ మా కుటుంబానికి కొత్తగా వచ్చిన వారిని చూడండని అభిమానులకు తన కారును మమతా మోహన్ దాస్ పరిచయం చేశారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కార్లు, బైక్ల ఫొటోలను ఆమె తరచుగా పోస్ట్ చేస్తుంటారు. కొన్ని నెలల క్రితమే ఒక స్పోర్ట్స్ బైక్ను ఆమె సొంతం చేసుకున్నారు.
బెంగళూరులో స్పోర్ట్స్ బైక్ను నడుపుతున్న వీడియోను గతంలో అభిమానులతో పంచుకున్నారు. బైక్ను నడుపుతున్నప్పుడు ఏ విధంగా ఎంజాయ్ చేసిందన్నది అభిమానులకు వివరించారు. ప్రస్తుతం ఆమె Enemy చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఆనంద్శంకర్ దర్శకత్వం వహించనున్నారు.