సినీరచయిత సాయిమాధవ్ బుర్రాకు డాక్టరేట్

ABN , First Publish Date - 2021-11-18T00:12:01+05:30 IST

సినీరచయిత సాయిమాధవ్ బుర్రా డాక్టరేట్ అందుకున్నారు. సినీరంగంలో రచయితగా తన ప్రస్థానాన్ని గుర్తించి కాలిఫోర్నియాకు చెందిన న్యూలైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు ఆయనకు డాక్టరేట్ ప్రకటించారు. సాయిమాధవ్

సినీరచయిత సాయిమాధవ్ బుర్రాకు డాక్టరేట్

సినీరచయిత సాయిమాధవ్ బుర్రా డాక్టరేట్ అందుకున్నారు. సినీరంగంలో రచయితగా తన ప్రస్థానాన్ని గుర్తించి కాలిఫోర్నియాకు చెందిన న్యూలైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు ఆయనకు డాక్టరేట్ ప్రకటించారు. సాయిమాధవ్ బుర్రా బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. అనంతరం ఈ పురస్కారాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లుగా సాయిమాధవ్ బుర్రా తెలిపారు. కాగా, ఈ డాక్టరేట్ ప్రదానోత్సవానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై.. సాయిమాధవ్‌కు అభినందనలు తెలిపారు.

Updated Date - 2021-11-18T00:12:01+05:30 IST