బాలీవుడ్‌ వలలో చిక్కుకోవద్దు!

ABN , First Publish Date - 2022-01-25T05:58:46+05:30 IST

వివాదాస్పదమైన వ్యాఖ్యలకు మారు పేరు కంగనా రనౌత్‌. తను ట్వీట్‌ చేసినా, మైకు పట్టుకుని మాట్లాడినా.. ఏదో ఓ సంచలనం రేగుతుంది...

బాలీవుడ్‌ వలలో చిక్కుకోవద్దు!

కంగన సలహా

వివాదాస్పదమైన వ్యాఖ్యలకు మారు పేరు కంగనా రనౌత్‌. తను ట్వీట్‌ చేసినా, మైకు పట్టుకుని మాట్లాడినా.. ఏదో ఓ సంచలనం రేగుతుంది. తాజాగా ఇన్‌ స్టా స్టోరీలో సౌత్‌ ఇండియన్‌ హీరోల్ని పొగుడుతూ ఓ పోస్ట్‌ పెట్టింది. దక్షిణాది కథానాయకులు నిబద్ధత కలవారని, సినిమా సినిమాకీ వాళ్లకు ప్యాషన్‌ పెరుగుతూ ఉంటుందని, కుటుంబానికి ఎంతో విలువ ఇస్తారని, అందుకే వాళ్లు అంత ఎత్తుకు ఎదిగారని కామెంట్‌ చేసింది. ఈ వ్యాఖ్యలకు అల్లు అర్జున్‌, యశ్‌ ఫొటోలను కూడా జోడించింది. అయితే... బాలీవుడ్‌ వలలో చిక్కుకోవద్దని, వాళ్లు మీ ఖ్యాతిని పాడు చేయాలని  చూస్తారని సలహా కూడా ఇచ్చింది. ‘పుష్ప’తో అల్లు అర్జున్‌ క్రేజ్‌ బాలీవుడ్‌కి పాకింది. తనతో సినిమాలు చేయడానికి అక్కడి నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారు. త్వరలోనే అల్లు అర్జున్‌ ఓ పాన్‌ ఇండియా సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో కంగనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని కలిగిస్తున్నాయి. సౌత్‌ హీరోలు మంచోరని, బాలీవుడ్‌ మాయలో పడొద్దంటూ తాను చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ చర్చకు దారి తీశాయి. 


Updated Date - 2022-01-25T05:58:46+05:30 IST