సంక్రాంతి బరి నుండి తప్పుకున్న మరో చిత్రం

ABN , First Publish Date - 2022-01-10T22:05:53+05:30 IST

సంక్రాంతి బరి నుండి ఒక్కో చిత్రం తప్పుకుంటున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా, అలాగే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల విషయంలో వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఇప్పటికే చాలా వరకు విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ పరిస్థితుల్లో కూడా

సంక్రాంతి బరి నుండి తప్పుకున్న మరో చిత్రం

సంక్రాంతి బరి నుండి ఒక్కో చిత్రం తప్పుకుంటున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా, అలాగే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల విషయంలో వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఇప్పటికే చాలా వరకు విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ పరిస్థితుల్లో కూడా సంక్రాంతికి వచ్చేందుకు కొన్ని చిత్రాల విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. అయితే విడుదల తేదీని అయితే ప్రకటించారు కానీ.. పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పు రావడంతో ధైర్యం చేయలేక మళ్లీ వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటిస్తున్నారు. జనవరి 14న విడుదల చేయబోతున్నామంటూ ప్రకటించిన ‘డీజే టిల్లు’ మూవీని వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


‘‘కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న కారణంగానూ, అలాగే మా టీమ్‌లోనూ కొందరు కోవిడ్ బారిన పడటంతో.. ‘డీజే టిల్లు’ చిత్రాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాము. ఈ క్రేజీ చిత్రాన్ని ఇప్పటికి వాయిదా వేస్తున్నప్పటికీ.. త్వరలోనే మళ్లీ థియేటర్లలోకి తీసుకువస్తామని తెలియజేస్తున్నాము..’’ అని చిత్రయూనిట్ ప్రకటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు విమల్ కృష్ణ దర్శకత్వంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.



Updated Date - 2022-01-10T22:05:53+05:30 IST