‘బంగార్రాజు’ దర్శకుడి చేతుల్లో ప్రభుదేవా ‘ఫ్లాష్ బ్యాక్’

ABN , First Publish Date - 2021-11-26T02:58:35+05:30 IST

ప్రభుదేవా, రెజీనా, అనసూయల కాంబినేషన్‌లో రాబోతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఫ్లాష్ బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనేది ఉప శీర్షిక. అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్ మీద పి రమేష్ పిళ్లై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వరకు రెండు సినిమాలను తెరకెక్కించిన డాన్ సాండీ ఈ చిత్రాన్ని

‘బంగార్రాజు’ దర్శకుడి చేతుల్లో ప్రభుదేవా ‘ఫ్లాష్ బ్యాక్’

ప్రభుదేవా, రెజీనా, అనసూయల కాంబినేషన్‌లో రాబోతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఫ్లాష్ బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనేది ఉప శీర్షిక. అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్ మీద పి రమేష్ పిళ్లై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వరకు రెండు సినిమాలను తెరకెక్కించిన డాన్ సాండీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తుండగా.. గురువారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ని ‘బంగార్రాజు’ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


ఈ పోస్టర్స్‌లో ఒకదానిలో ప్రభుదేవా, రెజీనాలో లవ్ ట్రాక్ చూపిస్తే. రెండో పోస్టర్‌లో అనసూయ లుక్‌ని రివీల్ చేశారు. ఈ రెండు పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం యూత్‌ను ఆకట్టుకునే ఉంటుంది. ఇందులో హై ఎమోషన్స్ ఉంటాయి. అంతకు మించి కథను చెప్పే విధానం బాగుంటుంది. టైటిల్, ట్యాగ్‌లైన్‌తోనే సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. సినిమాలో  ప్రతీ సీన్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రెజీనా ఇందులో ఆంగ్లోఇండియన్ టీచర్‌ పాత్రలో కనిపిస్తే.. అనసూయ మరో ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ఈ రెండు పాత్రలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభుదేవా పాత్ర చాలా కొత్తగా ఉండబోతోంది. అనసూయ పాత్ర సినిమాకు హైలెట్ అవుతుంది..’’ అని తెలిపారు. 



Updated Date - 2021-11-26T02:58:35+05:30 IST