టాలీవుడ్ డైరెక్టర్ మృతి

ABN , First Publish Date - 2021-08-02T22:02:43+05:30 IST

నటుడు, దర్శకుడు గిరిధర్‌ (64) కన్నుమూశారు. ఆరేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. ఆదివారం తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

టాలీవుడ్ డైరెక్టర్ మృతి

నటుడు, దర్శకుడు గిరిధర్‌ (64) కన్నుమూశారు. ఆరేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. ఆదివారం తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం ఇరంగారిపల్లెలో 1957 మే 21న జన్మించిన గిరిధర్‌  1982లో సినీ ఇండస్ర్టీలో అడుగుపెట్టాడు. కోదండరామిరెడ్డి, ఈవీవీ సత్యనారాయణ,  గుణశేఖర్‌  వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ‘వరుడు’, ‘గుడుంబా శంకర్‌’, ‘అన్నవరం’, ‘వన్‌’, ‘సుప్రీమ్‌’ చిత్రాలకు కోడైరెక్టర్‌గా పనిచేశారు. ‘శుభ ముహూర్తం’ సినిమాకు దర్శకత్వం వహించి సూపర్‌ హిట్‌ అందుకున్నారు. ‘100 పర్సెంట్‌ లవ్‌’, ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’, ‘శ్రీమంతుడు’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’, వంటి 20 చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. గిరిధర్‌ మృతి పట్ల టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలిపారు. 


Updated Date - 2021-08-02T22:02:43+05:30 IST