Dil Raju : వాస్తవాలు తెలుసుకొని రాయండి..
ABN , First Publish Date - 2022-08-16T20:48:35+05:30 IST
‘వాస్తవాలు తెలుసుకొని రాయండి. లేకపోతే మూసుకు కూర్చోండి’.. అని మీడియాను ఉద్దేశించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తీవ్రంగా స్పందించారు. ‘కార్తికేయ 2’ (Karthikeya 2) సక్సెస్ మీట్లో అతిథిగా పాల్గొన్న దిల్ రాజు.. ఈ సినిమా విడుదల విషయంలో తనపై వస్తున్న ఆరోపణలకు మీడియాపై మండిపడ్డారు.
‘వాస్తవాలు తెలుసుకొని రాయండి. లేకపోతే మూసుకు కూర్చోండి’.. అని మీడియాను ఉద్దేశించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తీవ్రంగా స్పందించారు. ‘కార్తికేయ 2’ (Karthikeya 2) సక్సెస్ మీట్లో అతిథిగా పాల్గొన్న దిల్ రాజు.. ఈ సినిమా విడుదల విషయంలో తనపై వస్తున్న ఆరోపణలకు మీడియాపై మండిపడ్డారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ‘మీడియా వారు అడిగితే టైమిస్తాను. నిజానిజాలు తెలుసుకొని రాయండి. మీ వ్యూస్, క్లిక్కులు, సబ్స్ర్కైబర్ల కోసం నా పేరును పాడు చేయవద్దు. మీరు తొక్కితే తొక్కించుకునేంత చేతకాని వారెవరూ లేరిక్కడ. అసలు ఏమీ తెలుసుకోకుండానే మీడియా రాద్ధాంతం మొదలు పెట్టింది. సాధారణంగా నేను ఎవరితోనూ గొడవలు పెట్టుకోను. ‘కార్తికేయ 2’ వదంతి నన్ను చాలా అప్సెట్ చేసింది. మీడియా నన్ను బలిపశువును చేసింది.
ఒక పక్క ఐదు సినిమాలు ఆడుతున్నా.. ‘కార్తికేయ 2’ నైజాంలో రూ. 4 కోట్లు వసూలు చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) టాలీవుడ్లో నెంబర్ వన్ నిర్మాణ సంస్థ. వారిని తొక్కేంత దమ్ము టాలీవుడ్లో ఎవరికి ఉంది? మీడియాకి కొంచెమైనా కామన్సెన్స్ ఉండాలి. ఇప్పుడొక సినిమా మరో సినిమాకి ఊపిరి పోస్తోంది. అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) ప్రీరిలీజ్కు కూడా పిలిచారు. నాకు మంచి స్నేహితుడు. ‘హ్యాపిడేస్, యువత’ చిత్రాల నుంచి నిఖిల్ (Nikhil) నాకు క్లోజ్. సినిమా రిలీజ్ను రెండు సార్లు వాయిదా వేసే ముందు అందరినీ సంప్రదించారు. ఆపైనే నిర్ణయం తీసుకున్నారు తప్ప ఇందులో నా ప్రమేయం ఎంతమాత్రం లేదు. మీ ఇష్టం అన్నాను తప్ప బలవంతం చేయలేదు’... అని దిల్ రాజు పేర్కొన్నారు.