అందరూ రావాలనే టికెట్ ధరలు తగ్గించాం
ABN , First Publish Date - 2022-05-20T05:30:00+05:30 IST
‘పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ ధర లు పెరగడానికి దిల్ రాజే కారణం అంటూ నాపై తప్పుడు ప్రచారం చేశారు.
‘పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ ధర లు పెరగడానికి దిల్ రాజే కారణం అంటూ నాపై తప్పుడు ప్రచారం చేశారు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు రావాలనే ఇప్పుడు‘ఎఫ్ 3’ సినిమా టికెట్ ధరలు తగ్గించాం. మూవీ చూసి ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం ఖాయం’ అని నిర్మాత దిల్ రాజు అన్నారు. వెంకటేష్, వరుణ్తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రమిది. దిల్రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ...
డబ్బు చుట్టూ తిరిగే కథ ఇది. అనిల్ కథను బాగా రాశాడు. అద్భుతంగా తీశాడు. ప్రేక్షకులు 90 నిమిషాలు పాటు నవ్వుతూనే ఉంటారు. తప్పకుండా రిపీట్ ఆడియన్స్ వస్తారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘ఎఫ్ 4’ ఉంటుంది. అనిల్ మంచి లైన్ చెప్పారు.
వెంకటేష్ గారు ఒక నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన హీరో. ఆయన నిర్మాత కోసం ఎక్కువ ఆలోచిస్తారు. సెట్లో చాలా హుషారుగా ఉంటారు.
టికెట్ ధరలు అందుబాటులో లేక చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతున్నారు. ‘ఎఫ్ 3’ అన్ని వర్గాలను అలరించే సినిమా. అందరికీ అందుబాటులో ఉండాలని పాత జీవో ప్రకారం టికెట్ ధరలను తగ్గించాం.