ప్రేమ జంట మధ్య ఎంగేజ్‌మెంట్ వార్తలు చిచ్చుపెట్టాయా? ఒకరినొకరు తిట్టుకుంటున్నారా?

ABN , First Publish Date - 2021-09-29T21:45:07+05:30 IST

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌కు బ్రేకప్ చెప్పేసిన ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్.. యంగ్ హీరో విక్కీ కౌశల్‌తో జతకట్టింది.

ప్రేమ జంట మధ్య ఎంగేజ్‌మెంట్ వార్తలు చిచ్చుపెట్టాయా? ఒకరినొకరు తిట్టుకుంటున్నారా?

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌కు బ్రేకప్ చెప్పేసిన ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్.. యంగ్ హీరో విక్కీ కౌశల్‌తో జతకట్టింది. వీరిద్దరూ కలిసి బయట కనిపించారు. జంటగా విహార యాత్రలకు వెళ్లారు. దీంతో వీరిద్దరూ సహజీనం చేస్తున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయినా ఆ వార్తలను ఈ ఇద్దరూ ఖండించలేదు. దీంతో వారి ప్రేమయాణం నిజమేనని అందరూ భావించారు. ఇటీవల వీరి ఎంగేజ్‌మెంట్ వార్తలు బయటకు వచ్చాయి. 


వీరిద్దరూ ఈ నెలలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్నారని, డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంటారని వార్తలు మొదలయ్యాయి. ఈ వార్తలు ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టినట్టు బాలీవుడ్ మీడియా సమాచారం. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయాంలో ఎంగేజ్‌మెంట్ వార్తలు రావడం వారిద్దరినీ ఇబ్బంది పెట్టిందట. ఈ వార్తలను విక్కీ కౌశల్ టీమ్ సభ్యులే ప్రచారంలోకి తీసుకొచ్చారని కత్రిన భావిస్తోందట. కత్రిన పీఆర్ టీమ్ ఈ వార్తలను పుట్టించిందని కౌశల్ భావిస్తున్నాడట. దీంతో ఈ ఇద్దరూ ఈ విషయమై గొడవ కూడా పడినట్టు సమాచారం.  

Updated Date - 2021-09-29T21:45:07+05:30 IST