రూ. 150 కోట్లతో ధనుష్‌ కొత్త ఇల్లు

ABN , First Publish Date - 2022-03-12T06:44:16+05:30 IST

తమిళ చిత్రరంగ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మాజీ అల్లుడు, హీరో ధనుష్‌ కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు.

రూ. 150 కోట్లతో ధనుష్‌ కొత్త ఇల్లు

తమిళ చిత్రరంగ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మాజీ అల్లుడు, హీరో ధనుష్‌ కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. గత ఏడాది చెన్నైలోని పొయెస్‌ గార్డెన్స్‌ ఏరియాలో ఆయన రూ. 25 కోట్లతో స్థలం కొన్నారు. బాగా ధనవంతులు ఉండే పొయెస్‌ గార్డెన్స్‌లో ఇల్లు ఉండడం స్టేటస్‌కు సింబల్‌గా భావిస్తుంటారు చాలా మంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఈ ప్రాంతంలోనే ఉండేవారు. ప్రస్తుతం రజనీకాంత్‌ కూడా పొయెస్‌ గార్డెన్స్‌లోనే ఉంటున్నారు. ఆయన ఇంటికి సమీపంలోనే స్థలం కొనుగోలు జేశారు ధనుష్‌. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన భూమి పూజకు రజనీకాంత్‌ దంపతులు కూడా హాజరయ్యారు. ఇది జరిగిన కొన్ని నెలలకే రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య, ధనుష్‌ విడిపోయారు. రజనీకాంత్‌ కుటుంబానికి దూరం అయినా పొయెస్‌ గార్డెన్స్‌లో ఇంటి నిర్మాణం ఆపలేదు ధనుష్‌. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 19 వేల చదరపు  అడుగుల స్థలంలో నాలుగు అంతస్తులతో ఇంటి నిర్మాణం జరుగుతోంది. తన డ్రీమ్‌ హౌస్‌ కోసం రూ. 150 కోట్లు ఖర్చు పెడుతున్నారు ధనుష్‌. 

Updated Date - 2022-03-12T06:44:16+05:30 IST