ధనుష్ ‘మారన్’.. ఓటీటీలోనే!
ABN , First Publish Date - 2022-01-19T02:34:08+05:30 IST
జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ హీరోగా దర్శకుడు కార్తిక్ నరేన్ కాంబినేషన్లో ‘మారన్’ పేరుతో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత టీజీ త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం
జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ హీరోగా దర్శకుడు కార్తిక్ నరేన్ కాంబినేషన్లో ‘మారన్’ పేరుతో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత టీజీ త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే, ఈ సినిమాను థియేటర్లో విడుదల చేస్తారా? లేదా ఓటీటీలో విడుదల చేస్తారా? అనే సందేహాలకు చిత్ర బృందం ఫుల్స్టాఫ్ పెట్టింది.
ఈ చిత్ర మోషన్ పోస్టర్ను సంక్రాంతి సందర్భంగా డిస్నీప్లస్ హాట్స్టార్లో రిలీజ్ చేశారు. తద్వారా సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేస్తామని చెప్పకనే చెప్పారు. ఇంతకుముందు లాక్డౌన్లో ధనుష్ చిత్రాలు డైరెక్ట్గా ఓటీటీలోనే విడుదలైన విషయం తెలిసిందే. కాగా, జీవీ. ప్రకాష్ సంగీతం సమకూర్చుతున్న ‘మారన్’ చిత్రంలో హీరోయిన్గా మాళవికా మోహనన్ నటిస్తుండగా.. అమీర్, సముద్ర ఖని, స్మృతి వెంకట్, మహేంద్రన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఈ మూవీలో ధనుష్ జర్నలిస్టు పాత్రను పోషిస్తున్నారు.