Dhanush: సీక్వెల్ మూవీపై దర్శకుడు క్లారిటీ..

ABN , First Publish Date - 2022-08-02T19:39:30+05:30 IST

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran) ‘వడ చెన్నై’ (Vada Chennai) మూవీపై క్లారిటీ ఇచ్చారు. 2018లో ధనుష్‌ (Dhanush) హీరోగా వెట్రిమారన్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘వడ చెన్నై’.

Dhanush: సీక్వెల్ మూవీపై దర్శకుడు క్లారిటీ..

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran) ‘వడ చెన్నై’ (Vada Chennai) మూవీపై క్లారిటీ ఇచ్చారు. 2018లో ధనుష్‌ (Dhanush) హీరోగా వెట్రిమారన్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘వడ చెన్నై’. ఇందులో హీరో మూడు గెటప్‌లలో కనిపించాడు. ఈ గెటప్‌లతో పాటు ధనుష్‌ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ఈ చిత్రం రెండో భాగంపై దర్శకుడు వెట్రిమారన్‌ ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పుడు నేను రెండు చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నాను. వాటిలో ఒకటి సూర్య హీరోగా తెరకెక్కే ‘వాడివాసల్‌’, రెండోది ‘విడుదలై’. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత ధను్‌షతో నా చిత్రం ఉంటుంది. 


ముఖ్యంగా ‘వడ చెన్నై’ రెండో భాగానికి సంబంధించిన 40 శాతం సీన్లు మా చేతుల్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాను’.. అని వెట్రిమారన్‌ తెలిపారు. దీంతో ధనుష్ అభిమానులు బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ రాబోతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక వెట్రిమారన్..ఇప్పటి వరకు తీసినిమాలతో తమిళ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ దర్శకుడితో సినిమా చేయాలని టాలీవుడ్ హీరోలు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


ఇక ధనుష్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో నటిస్తున్న మొదటి స్ట్రైట్ మూవీ సార్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీని తమిళంలో ‘వాత్తి’ పేరుతోనూ ఒకేసారి విడుదల చేయనున్నారు. కాగా, ధనుష్ నటించిన హాలీవుడ్ మూవీ ‘ది గ్రేమ్యాన్’ ఇటీవల ఓటీటీలో వచ్చింది. ఇందులో ఆయన పోషించిన పాత్రకు మంచి ఆదరణ దక్కింది. 

Updated Date - 2022-08-02T19:39:30+05:30 IST