నా పర్స్‌ను కొట్టేశారు.. ఒక్కరు కూడా సాయం చేయలేదంటూ షాకింగ్ అనుభవాన్ని బయటపెట్టిన Kangana Ranaut

ABN , First Publish Date - 2022-05-20T01:04:32+05:30 IST

సమకాలీన అంశాలపై తరచు స్పందించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). రాజకీయ అభిప్రాయాలను పంచుకోవడం పాటు బాలీవుడ్‌లో నెపోటిజంపై కూడా మాట్లాడుతుంటుంది. కథానాయిక

నా పర్స్‌ను కొట్టేశారు.. ఒక్కరు కూడా సాయం చేయలేదంటూ షాకింగ్ అనుభవాన్ని బయటపెట్టిన Kangana Ranaut

సమకాలీన అంశాలపై తరచు స్పందించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). రాజకీయ అభిప్రాయాలను పంచుకోవడం పాటు బాలీవుడ్‌లో నెపోటిజంపై కూడా మాట్లాడుతుంటుంది. కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తాజాగా ఆమె ‘‘ధాకడ్’’ (Dhaakad) చిత్రంలో నటించింది. యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు రజనీష్ ఘయ్ (Razneesh Ghai) దర్శకత్వం వహించాడు. అర్జున్ రాంపాల్(Arjun Rampal), దివ్యా దత్తా (Divya Dutta) కీలక పాత్రలు పోషించారు. ‘ధాకడ్’ చిత్రం మే 20న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. అందులో భాగంగా కంగన మీడియాకు ఇంటర్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో యూరప్‌లో తనకెదురైన షాకింగ్ అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. 


తన పర్స్‌ను కొట్టేస్తే ఎవరు కూడా సహాయం చేయలేదని కంగనా రనౌత్ తెలిపింది. ‘‘ఇటలీ-స్విట్జర్‌లాండ్ బోర్డర్‌లో స్కీయింగ్ చేయడానికీ నేను వెళ్లాను. అక్కడ ఓ స్కూల్ ఉంది. ఆ భవంతిలో కొంత మంది రహస్యంగా జీవిస్తున్నారు. వారిని చూడగానే నేను ఆందోళనకీ గురయ్యాను. అందువల్ల వెంటనే రైలు ఎక్కి అక్కడి నుంచి బయలు దేరాలని నిర్ణయించుకున్నాను. స్టేషన్‌లో ఉండగానే ఓ వ్యక్తి నన్ను కొట్టాడు. నా పర్సును దొంగిలించాడు. ఆ పర్సులో కొన్ని వేల డాలర్స్‌తో పాటు కార్డ్స్ కూడా ఉన్నాయి. నేను ట్రైన్ ఎక్కిన అనంతరం పర్సును చూసుకుంటే ఖాళీగా ఉంది. అదృష్టమేమిటంటే నా పాస్‌పోర్టు మాత్రం చోరీ కాలేదు. నేను కొత్త ప్రదేశంలో చిక్కుకు పోయాను. అందువల్ల నా సోదరికీ సమాచారం ఇచ్చాను. దీంతో ఆమె నా వద్దకీ మెనేజర్‌ని పంపింది. ఆ రోజు నా మెనేజర్ వచ్చే వరకు నేను ఆకలి, దప్పికలతోనే ఉండిపోయాను. యూరప్‌లో ఒక్కరు కూడా సహాయం చేయలేదు. కానీ, భారత్‌లో అయితే సమోసా అమ్మే వ్యక్తి కూడా కొన్ని నీళ్లయినా ఇచ్చేవాడు’’ అని కంగనా రనౌత్ చెప్పింది.

Updated Date - 2022-05-20T01:04:32+05:30 IST