COVID పరీక్షలకి వేల రూపాయలు ఖర్చయ్యాయంటూ వాపోయిన నటి

ABN , First Publish Date - 2022-01-21T02:50:27+05:30 IST

టెలివిజన్ బ్యూటీ డెబీనా బోనర్జీకి కరోనా ఇక్కట్లు తప్పటం లేదు. అయితే, ఆమెకు అందరిలా మహమ్మారి సోకటం వల్ల తంటాలు ఎదురుకాలేదు. డెబీనా తన భర్త గుర్మీత్ చౌదరీతో కలసి లండన్ వెళ్లగా అక్కడ ఆమెకు కోవిడ్ పరీక్షల రూపంలో వైరస్ సెగ తగిలింది!

COVID పరీక్షలకి వేల రూపాయలు ఖర్చయ్యాయంటూ వాపోయిన నటి

టెలివిజన్ బ్యూటీ డెబీనా బోనర్జీకి కరోనా ఇక్కట్లు తప్పటం లేదు. అయితే, ఆమెకు అందరిలా మహమ్మారి సోకటం వల్ల తంటాలు ఎదురుకాలేదు. డెబీనా తన భర్త గుర్మీత్ చౌదరీతో కలసి లండన్ వెళ్లగా అక్కడ ఆమెకు కోవిడ్ పరీక్షల రూపంలో వైరస్ సెగ తగిలింది!


కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉండగానే టెలివిజన్ నటులు డెబీనా, గుర్మీత్ లండన్ ట్రిప్ పూర్తి చేసుకొచ్చారు. అక్కడి ముచ్చట్లు చెబుతూ యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ అప్‌లోడ్ చేశారు. అయితే, తాజా వీడియోలో డెబీనా కోవిడ్ పరీక్షల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టామని చెప్పుకొచ్చింది. మొత్తంగా 60 వేల రూపాయలు తనకు, తన భర్తకు కరోనా టెస్టులకే అయ్యాయని ఆమె వాపోయింది. ఇండియా నుంచీ వాళ్లిద్దరూ లండన్‌కు వెళ్లగా... అక్కడ దిగగానే 15వేల రూపాయల చొప్పున ఇద్దరికీ టెస్టుల కోసం ఫీజులు వసూలు చేశారట. తిరిగి లండన్‌లో విమానం ఎక్కేటప్పుడు కూడా మళ్లీ టెస్టులు నిర్వహించి ఒక్కొక్కరికి 15 వేలు తీసుకున్నారట. అలా మొత్తంగా నాలుగు కోవిడ్ టెస్టులకిగానూ 15 వేల చొప్పున 60 వేలు తమ ఖాతాల్లో ఖాళీ అయ్యాయని డెబీనా అంటోంది. కోవిడ్ ఎఫెక్ట్ సెలబ్రిటీల మీదే ఇలా ఉందంటే ఇక సామాన్యుల ఆరోగ్య, ఆర్దిక పరస్థితులు మనం తేలిగ్గానే అంచనా వేయవచ్చు... 

Updated Date - 2022-01-21T02:50:27+05:30 IST