'రౌడీ బాయ్స్' ఓటీటీ రిలీజ్కు డేట్ ఫిక్స్..!
ABN , First Publish Date - 2022-03-01T13:50:53+05:30 IST
'రౌడీ బాయ్స్' ఓటీటీ రిలీజ్కు డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా రూపొందిన యూత్ఫుల్ ఎంటర్టైనర్కు
'రౌడీ బాయ్స్' ఓటీటీ రిలీజ్కు డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా రూపొందిన యూత్ఫుల్ ఎంటర్టైనర్కు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. కాలేజ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్ లు నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా, ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకువస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ 5లో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతుందని తాజాగా మేకర్స్ ప్రటించారు. ఇక ఇందులో శ్రీకాంత్ అయ్యంగార్, కార్తీక్ రత్నం, కోమలి ప్రసాద్, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు.