‘మిషన్ 2020’ చిత్రం నేటి సమాజానికి అవసరం: ‘దర్జా’ టీమ్

ABN , First Publish Date - 2021-10-31T01:29:26+05:30 IST

హనీ బన్నీ క్రియేషన్స్ సమర్పణలో మధు మృదు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీ మిత్ర అండ్ మై విలేజ్ సమర్పణలో నవీన్ చంద్ర హీరోగా యదార్ధ సంఘటనల ఆధారంగా సమకాలీన జీవిత సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన

‘మిషన్ 2020’ చిత్రం నేటి సమాజానికి అవసరం: ‘దర్జా’ టీమ్

హనీ బన్నీ క్రియేషన్స్ సమర్పణలో మధు మృదు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీ మిత్ర అండ్ మై విలేజ్ సమర్పణలో నవీన్ చంద్ర హీరోగా యదార్ధ సంఘటనల ఆధారంగా సమకాలీన జీవిత సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మిషన్ 2020’. కరణం బాబ్జి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 29 థియేటర్లలో విడుదలై సక్సెస్‌ఫుల్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని చూసిన ‘దర్జా’ మూవీ టీమ్.. సినిమా ఎంతగానో నచ్చిందని తెలుపుతూ.. ‘మిషన్ 2020’ టీమ్‌ని శాలువాలతో సత్కరించి, టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ సందర్భంగా ‘దర్జా’ మూవీ ప్రొడ్యూసర్ శివశంకర్ పైడిపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ రవి పైడిపాటి మాట్లాడుతూ.. ‘‘మిషన్ 2020 చిత్రాన్ని చూశాము. మాకు చాలా బాగా నచ్చింది. యూత్ అంతా తప్పని సరిగా చూడాల్సిన చిత్రమిది. మెసేజ్ అనే కాదు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. డైరెక్టర్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు. చాలా క్లారిటీగా.. చూస్తున్న ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా మంచి మెసేజ్‌తో చిత్రాన్ని రూపొందించారు. వారికి ముందుగా మా అభినందనలు. అలాగే ఇలాంటి స్టోరీతో సినిమా చేసిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఇంక సంగీత దర్శకుడు రాప్‌రాక్ షకీల్ ఇచ్చిన ఆర్ఆర్ మాములుగా లేదు. ఆయనే మా ‘దర్జా’ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. అతనికి స్పెషల్‌గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ థియేటర్లలో చూడాలి. ఈ చిత్రం నేటి సమాజానికి ఎంతో అవసరం. 8వ తరగతి, ఆ పైన చదువుతున్న పిల్లల తల్లిదండ్రులందరూ తప్పక ఈ చిత్రాన్ని చూడండి. టీమ్‌ అందరికీ కంగ్రాట్స్..’’ అన్నారు.


సంగీత దర్శకుడు రాప్‌రాక్ షకీల్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది ప్రేక్షకులు ఇచ్చిన విజయం. మార్నింగ్ షో తర్వాత మ్యాట్నీకే థియేటర్స్ పెరిగాయి. ఇది చాలు సినిమా సక్సెస్ గురించి చెప్పడానికి. మా సినిమా చూసి ‘దర్జా’ మూవీ టీమ్ ఇంత గొప్పగా సత్కరించి, అభినందించినందుకు వారికి ధన్యవాదాలు. మేము ఎలాంటి సక్సెస్‌ని అయితే ఊహించామో.. అలాంటి సక్సెస్‌ని ప్రేక్షకులు ఇచ్చారు. ఈ చిత్రంలో భాగమైనందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను. పేరేంట్స్ కొన్ని విషయాలను పిల్లలకు డైరెక్ట్‌గా చెప్పలేరు. ఇలాంటి సినిమాలు చూపించడం ద్వారా అలాంటి విషయాలు చెప్పిన వారవుతారు. ఈ సినిమాని మీ పిల్లలని పక్కన కూర్చోబెట్టుకుని చూపించండి. పిల్లలకు, పేరేంట్స్‌కు ఈ సినిమా అవసరం. ఈ సినిమాకు సెన్సార్ వారు ఇచ్చిన సపోర్ట్‌ని మరిచిపోలేం. నిర్మాత, దర్శకుడు చక్కని సపోర్ట్ ఇచ్చారు. ఈ టీమ్‌తో మరిన్ని మంచి సినిమాలు చేయాలని భావిస్తున్నాను..’’ అని తెలిపారు.

Updated Date - 2021-10-31T01:29:26+05:30 IST